తెలుగులో జెనీలియా అంటే తెలియని వారు బహుశా ఉండరేమో.అంతగా టాలీవుడ్ లో పాతుకుపోయింది.
ఈ బ్యూటీ దశాబ్ద కాలం పాటు తెలుగు తెరపై స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.ఈమె కెరీర్ లో మంచి మంచి సినిమాలు చాలానే ఉన్నాయి.
ఇక జెనీలియా బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ను 2012 లో ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు.
వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.అయితే గత కొన్ని రోజులుగా జెనీలియా పై బాడ్ ట్రోల్స్ బాగా వస్తున్నాయి.
ఎప్పుడో జరిగిన విషయం పై ఇప్పుడు ట్రోల్స్ వస్తున్నాయి.ఎప్పుడో ఒకసారి రితేష్ ప్రీతీ జింటా చేతులను పట్టుకుని ముద్దాడాడు.
ఆ సమయంలో జెనీలియా కాస్త జెలస్ అయినట్టు కోపంగా కనిపించింది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ విషయంపై చాలా మంది రకరకాలుగా బాడ్ కామెంట్స్ చేస్తున్నారు.వల్గర్ ఆంటీ అంటూ కొంతమంది కామెంట్ చేయడం ఆమెపై ట్రోల్స్ చేయడం వంటివి చేస్తూ ఉన్నారు.
తాజాగా వీరిద్దరూ కలిసి అర్ఫాజ్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్న పించ్ టాక్ షో లో పాల్గొన్నారు.ఈ షో లో వీరిద్దరూ ఎన్నో ఆసక్తికర విషయాలను ఇప్పటి వరకు ఎవ్వరికి తెలియని విషయాలను కూడా ఆడియెన్స్ తో పంచుకున్నారు.
అర్ఫాజ్ ఖాన్ ఈ ట్రోల్స్ పై జెనీలియాను స్పందించమని కోరగా.ఆమె మాట్లాడుతూ ఆ ట్రోల్స్ చేస్తున్న వ్యక్తి ఇంట్లో అంత సవ్యంగా ఉన్నట్టు లేదు.అందుకే మానసిక పరిస్థితి సరిగా లేదని ఆమె కామెంట్ చేసింది.అతడి పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నట్టు చెప్పి ఆ ట్రోల్స్ చేసిన వ్యక్తిని చెంపపై కొట్టినట్టు రిప్లై ఇచ్చింది.
ఇక ఆ కామెంట్స్ పై జెనీలియా భర్త కూడా స్పందించాడు.
ఆ కామెంట్ చేసిన వ్యక్తి పేరు చెప్పాల్సిందిగా అర్ఫాజ్ ఖాన్ ను అడిగారు.అతడు యోగ అని ఉందని చెప్పడంతో అతడు ఒక విషయాన్ని బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంది.నీకు నువ్వు అది చేయాలా అనే విషయాన్నీ ఆలోచించు కోవాల్సిందిగా సూచించాడు.
యోగ అనే పేరు పెట్టుకుంటే సరిపోదు శాపాల్ భాతీ, సువాసనలను ఎక్కువుగా ప్రాక్టీస్ చేయమని అతడికి సరదా వే లో కౌంటర్ వేసాడు.వీరిద్దరి ఇంటర్వ్యూ కు మంచి స్పందన వస్తుంది.