కేసీఆర్ అంటే మాటకారి.కేసీఆర్ అంటే ఆచితూచి మాట్లాడే వ్యక్తి.
తనకు ప్రతికూల పరిస్థితులను కూడా తనకు అనుకూలంగా మార్చుకోవడంలో పెద్ద దిట్ట.అలాంటి వ్యక్తి ఈ నడుమ ఎందుకో సహనం కోల్పోతున్నట్టు తెలుస్తోంది.
తన వ్యూహాలకు పదును పెట్టుకుండా కేవలం ఆవేశంతో మాట్లాడుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో తన వ్యూహాలతో ఎంతోమంది పెద్ద పెద్ద నేతలను ఓ ఆటాడుకున్న కేసీఆర్.
ఇప్పుడు మాత్రం ఇలాంటి చిన్న చిన్న ఓటములకు ఇలాంటి మాటలు మాట్లాడటమేంటని షాక్ అవుతున్నారు.
వరుసగా రెండు రోజులు సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఓ రేంజ్లో బీజేపీ మీద రెచ్చిపోయారు.
ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరుకుందా అన్న రేంజ్ లో మాటల తూటాలు విసిరారు.కేవలం బీజేపీని, బండి సంజయ్ ను మాత్రమే టార్గెట్ చేస్తూ సవాళ్లు విసిరారు.
తన ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు.ఇదంతా చూస్తుంటే హుజూరాబాద్ ఓటమి ఫలితమే అని స్పష్టంగా కనిపిస్తోంది.
ఎందుకంటే ఈ ఎన్నికల్లో గెలిచేందుకు కేసీఆర్ తన సర్వ శక్తులు ఒడ్డారు.చావో రేవో అన్న రేంజ్లో పోరాడారు.
కానీ చివరకు ఈటల గెలవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు.అదే సమయంలో తన పార్టీలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు కూడా బీజేపీ బాట పట్టే అవకాశం ఉందనే వార్తలు కేసీఆర్కు పెద్ద తలనొప్పిగా మారాయి.ఎక్కడ మిగతా వారంతా కూడా బయటకు వెళ్తారనే టెన్షన్తో బీజేపీ ఇమేజ్ తగ్గించేందుకు కేసీఆర్ సిద్ధం అయినట్టు తెలుస్తోంది.ఈటల రాజేందర్ గెలుపుతో బీజేపీకి పెరిగిన ఇమేజ్ ను ఎలాగైనా తగ్గించేందుకు కేసీఆర్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
ఇందులో భాగంగానే 12న ధర్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.తద్వారా అటు రైతుల్లో, ఇటు జనాల్లో కూడా బీజేపీ మీద వ్యతిరేకత తీసుకొచ్చి తన పార్టీని కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.