సినీ పరిశ్రమలో షూటింగ్ సమయంలో ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి.యాక్షన్ సినిమాల్లో ఎక్కువగా యాక్షన్ కి సంబంధించిన సన్నివేశాలు ఉండటంతో.
ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం దర్శక నిర్మాతలు ఎన్నో రకాల క్లిష్టమైన సన్నివేశాలను చేస్తుంటారు.అలా కొన్ని సందర్భాలలో అనుకోకుండా ప్రమాదాలు జరుగుతుంటాయి.
దీని వల్ల సిని బృందానికి అక్కడ షూటింగ్ లో పాల్గొన్న వాళ్ళకి ప్రమాదాలు జరుగుతుంటాయి.ముఖ్యంగా బాంబులు జరిగే వంటి సన్నివేశాలలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అనుకోకుండా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి.
తాజాగా షూటింగ్ లో ఇలాంటి ఘటన జరుగగా హీరోకి తీవ్రగాయాలయ్యాయి.
కన్నడ సినీ పరిశ్రమ నటుడు రిషబ్ శెట్టి.
ఈయన నటుడిగానే కాకుండా డైరెక్టర్ గా కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.ఉత్తమ దర్శకుడిగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు.2013లో నటుడిగా పరిచయమయ్యి.మంచి గుర్తింపు పొందిన వరుస సినిమాల అవకాశాలను సొంతం చేసుకున్నాడు.
అంతేకాకుండా అతి తక్కువ సమయంలో ఎక్కువ అవకాశాలను సొంతం చేసుకుంటూ ఏకంగా గత ఏడాది 8 సినిమాలకు ఓకే చెప్పాడు.
తాజాగా రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్న మరో సినిమా ‘హీరో‘.ఇక ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది.ఇందులో హీరో పాత్రకు ఓ ప్రమాదకరమైన సన్నివేశం ఉండగా.
ప్రమాదం తో గాయపడ్డాడు.పెట్రోల్ బాంబు ను విసిరేసే సన్నివేశం ఉండగా.
అందులో రిషబ్, గానావి లక్ష్మణ వెంటనే పరుగు పెట్టాల్సి ఉంటుంది.అయితే ఆ సమయంలో బాంబు విసిరిన వెంటనే వాళ్లు పరిగెత్తే లోపం వాళ్లకి మంటలు అంటుకొని గాయపడ్డారు.
ఈ ఘటన హాసన్ జిల్లా బేలూరులో షూటింగ్ సమయంలో జరిగింది.ఇందులో హీరో రిషబ్ కు తీవ్రంగా గాయాలు జరిగాయి.