యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.అప్పటి నుండి అన్ని పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తూ తన మార్కెట్ పెంచుకుంటూ పోతున్నాడు.
డార్లింగ్ తో ఒక్కసారి అయినా స్క్రీన్ పంచుకోవాలని హీరోయిన్స్ కోరుకుంటారు.ప్రభాస్ అంత పెద్ద స్టార్ అయినా కూడా సెట్ లో సరదాగా ఉంటారని హీరోయిన్స్ చాలా ఇంటర్వ్యూ లలో చెప్పఁడం మనం వైన్ ఉంటాం.
కేవలం హీరోయిన్స్ మాత్రమే కాదు ఆయనతో పనిచేసిన ప్రతి ఒక్కరు అదే మాట చెబుతారు.అయితే గత కొన్ని రోజులుగా ప్రభాస్ కు పూజా హెగ్డే కు మధ్య గొడవలు జరుగుతున్నాయని వార్తలు ప్రచారం అవుతున్నాయని.
పూజా హెగ్డే పై ప్రభాస్ కోపంగా ఉన్నాడని ఆమె తీరు ఏమాత్రం నచ్చడం లేదని.సెట్స్ కు కూడా చాలా లేట్ గా వస్తుందని ఇలా చాలా వార్తలు వైరల్ అయ్యాయి.
అంతేకాదు వీరిద్దరి మధ్య రాధేశ్యామ్ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలను విడివిడిగా తీసారని, ఆమె అందరితో ఎలా ప్రవర్తిస్తుందో అలాగే ప్రవర్తించాలని అందరు నిర్ణయించుకున్నారని ఇలా చాలా వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసాయి.అయితే ఈ వార్తలన్నిటిపై రాధేశ్యామ్ నిర్మాత క్లారిటీ ఇచ్చారు.మీడియాతో మాట్లాడిన నిర్మాత ఈ వార్తలో ఏ మాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేసారు.
ప్రభాస్, పూజా మధ్య ఎలాంటి గొడవలు కానీ క్యాష్ స్ కానీ లేవని వారిద్దరూ చాలా బాగున్నారని ఆయన తెలిపారు.ఈ వార్తలన్నీ ఉట్టి రూమర్స్ మాత్రమే అని వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగుంటుందని ఈ జంట వెండితెర ప్రేక్షకులను బాగా అలరిస్తుందని ఆయన తెలిపారు.ఇక పూజా టైమింగ్ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందని ఆమెతో పని చేయడం అందరికి కంఫర్ట్ గా ఉంటుందని తెలిపారు.