శేఖర్ కమ్ముల లీడర్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రిచా గంగోపాధ్యాయ ఈ భామ తరువాత రవితేజతో మిరపకాయ్ సినిమాతో హీరోయిన్ గా మెరిసి టాలీవుడ్ లో అందరి దృష్టిని తన వైపుకి తిప్పుకుంది.ఆ సినిమా తర్వాత ఈ భామ చాలా సినిమాలు చేసిన మరల కొద్దో గొప్పో భాగా గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ప్రభాస్ మిర్చీ.
అందులో ప్రభాస్ ని ప్రేమించే అమ్మాయిగా నటించిన రిచా ఆ సినిమా తర్వాత సినిమాలకి స్వస్తి చెప్పి అమెరికాలో పైచదువుల కోసం వెళ్ళిపోయింది.ఆ మధ్య మీడియా ముందుకొచ్చి తనకి సినిమాలలో నటించే ఉద్దేశ్యం తనకి లేదని తేల్చి చెప్పేసింది.
ఇక ఆ మధ్య తాను ప్రేమలో ఉన్నానని చెప్పిన ఈ భామ ఊహించని విధంగా పెళ్లి కూడా చేసుకొని సెటిల్ అయిపొయింది.
ఇదిలా ఉంటే వాషింగ్టన్ తాను చదువుతున్న టైంలోనే సహచర విద్యార్ధితో ప్రేమలో పడిన రిచా తాజాగా తన భర్తని పరిచయం చేసింది.
ఈ ఏడాది జనవరిలో వారి వివాహం హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాలలో జరిగినట్లు తెలిపింది.తన పెళ్లి ఫోటోలని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక ఆ పెళ్లి ఫోటోలపై ఆమె అభిమానులు ఆసక్తికరమైన కామెంట్స్ కూడా పెడుతున్నారు.