ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువ వివాదాస్పదంగా మారిన యాడ్ తనిష్క్ గోల్డ్ యాడ్.ఈ యాడ్ హిందువుల మనోభావాలని కించపరిచే విధంగా ఉందని, లవ్ జిహాద్ ని ప్రోత్సహించే విధంగా ఉందని హిందుత్వ సంఘాల నుంచి విమర్శలు వచ్చాయి.
అదే సమయంలో యాడ్ బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు.ఆ యాడ్ ని తీసుకొచ్చిన తనిష్క్ జ్యూయిలరీస్ మీద కూడా దాడులకి దిగారు.
ఇంత వివాదాస్పదంగా మారడంతో తనిష్క్ యాజమాన్యం ఆ యాడ్ ని తొలగించింది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఆ యాడ్ తన జీవితానికి చాలా దగ్గరగా ఉందని బాలీవుడ్ నటి రిచా చడ్డా చేసిన వాఖ్యలు సంచలనంగా మారాయి.
నటులు అలీ ఫజల్, రిచా చద్దా 2015 నుంచి డేటింగ్ చేస్తున్నారు.2017లో రిలేషన్షిప్ను అధికారికంగా ప్రకటించారు.ఏప్రిల్లో పెళ్లి చేసుకువాలని అనుకున్న కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది.అయితే త్వరలో పెళ్లి పీటలు ఎక్కడానికి ముహూర్తాలు చూస్తున్నారు.ఇదిలా ఉంటే మతాంతర వివాహం చేసుకుంటున్న రీచ ఆమె బాయ్ ఫ్రెండ్ రెండు కుటుంబాలని ఒప్పించి పెళ్ళికి సిద్ధమయ్యారు.ఈ విషయంపై రిచా చద్దా మాట్లాడుతూ తనిష్క్ యాడ్ చాలా బాగుందని ప్రశంసించింది.
అందులో తన జీవితం కనిపిస్తుందని చెప్పింది.అలీ నుంచి, అతడి కుటుంబం నుంచి ఎంతో ప్రేమను పొందుతున్నానని పేర్కొన్నారు.
కానీ దేశంలో అందరికి ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయిందని, అలాంటి మూర్ఖులని చూస్తే జాలేస్తుందని వాఖ్యలు చేసింది.అయితే రిచా చేసిన ఈ వాఖ్యలు కొంత మంది మతతత్వ సంఘాలకి కోపం తెప్పించాయి.
దీంతో ఆమెని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.