హీరో సుశాంత్ రాజ్ పూత్ ఆత్మహత్య విషయం ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు సినీ మరియు రాజకీయ వర్గాల్లో కూడా చర్చ నీయాంశంగా ఉన్న విషయం తెల్సిందే.ఈ కేసు మొత్తం కూడా ఇప్పుడు రియా చక్రవర్తి చుట్టు తిరుగుతోంది.
ఆమెపై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.అసలు విషయం తెలియకుండానే ఆమెను చాలా మంది దోషిని చేస్తున్నారు.
సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఆమెపై అనుమానం వ్యక్తం చేస్తూ చేసిన ఫిర్యాదు ఈ వివాదాన్ని మరింతగా పెంచింది.
ఇటీవలే ఈడీ వద్ద విచారణకు హాజరు అయిన రియా చక్రవర్తి పలు షాకింగ్ విషయాలను వెళ్లడి చేసిందట.
సుశాంత్ నుండి తాను ఒక్క రూపాయి కూడా పొందలేదు అంటున్న రియా చక్రవర్తి తనకు సుశాంత్ కుటుంబ సభ్యుల నుండి వేదింపులు ఎదురవుతున్నాయని చెప్పినట్లుగా తెలుస్తోంది.బాలీవుడ్లోని ఒక మీడియా సంస్థ కథనం ప్రకారం రియా చక్రవర్తిని సుశాంత్ కుటుంబ సభ్యులు మొదట బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నించిందట.
దానికి ఆమె లొంగక పోవడంతో ఆమెపై కేసు నమోదు చేసినట్లుగా ఆ కథనంలో పేర్కొనడం జరిగింది.
ఆ కథనం ఎంత వరకు నిజం అనే విషయం తెలియదు.
కాని ఆమె మాత్రం ఈ కేసుతో సంబంధం లేదని గట్టిగా వాదిస్తుందట.రియా చక్రవర్తి ఈడీ వద్ద పలు వాట్సప్ చాటింగ్ స్క్రీన్ షాట్లను చూపించిందట.
ఆ స్క్రీన్ షాట్స్లో ఉన్న విషయాలను చూస్తే రియాను సుశాంత్ కుటుంబ సభ్యులు టార్గెట్ చేసే విధంగా ఉందని అంటున్నారు.సుశాంత్ను ప్రేమించిన విషయం నిజమే.
ఆయన మృతి తనకు తీవ్రని దు:ఖంను మిగిల్చింది.అయినా నేను ఇప్పుడు కేసును ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది.