బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు విచారణ సీబీఐ పరిధిలో ఉంది.అయితే ఈ కేసు విచారణలో డ్రగ్స్ వ్యవహారం బయటపడింది.
దీనిపై సీబీఐ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.డ్రగ్స్ మాఫియాతో రియాకి ఉన్న సంబంధాలపై కూపీ లాగుతున్నారు.
తాజగా ఈ వ్యవహారంలో మరింత లోతుగా విచారిస్తున్న ఎన్సీబీ అధికారులు రియా చక్రవర్తి తమ్ముడు ఇంట్లో సోదాలు నిర్వహించారు.ఇదిలా ఉంటే తాజాగా డ్రగ్స్ వ్యవహారంలో ప్రమేయం ఉందని భావిస్తున్న రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తి, సుశాంత్ ఇంటి మేనేజర్ శామ్యూల్ మిరండాలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు నిన్న రాత్రి అరెస్ట్ చేశారు.
ఇద్దరినీ దాదాపు 10 గంటల పాటు విచారించిన తర్వాత అరెస్ట్ చేసినట్టు ఎన్సీబీ అధికారులు తెలిపారు.
షోవిక్, మిరండా నివాసాల్లో ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా షోవిక్ ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. షోవిక్ చక్రవర్తి గంజాయి, మరిజువానాలను ఆర్డర్ చేసి డ్రగ్ సరఫరాదారు అబ్దుల్ బాసిత్ పరిహార్కు గూగుల్ పే ద్వారా చెల్లింపులు జరిపేవాడని ఎన్సీబీ కోర్టుకు తెలియజేసింది.
షోవిక్, శామ్యూల్ల అరెస్టుపై సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ స్పందించింది.భగవంతుడికి కృతజ్ఞతలు.
మమ్మల్ని అందరినీ వాస్తవం వైపు నడిపించు అని ట్వీట్ చేసింది.అయితే తన తమ్ముడు అరెస్ట్ పై రియా చక్రవర్తి ఇప్పటి వరకు స్పందించలేదు.
ఇదిలా ఉంటే రియాకి కూడా డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు బయట పడితే ఆమెని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.