సుశాంత్ మృతి కేసులో అందరి వేలు కూడా ఇప్పుడు రియా వైపు చూపిస్తున్నాయి.దానికి తోడు ఆమె ప్రవర్తన కూడా అలాగే ఉంది అంటున్నారు.
ఆ మధ్య బీహార్ పోలీసులకు దొరకకుండా అండర్ గ్రౌండ్కు వెళ్లడం సుప్రీం కోర్టులో ఈమె పిటీషన్ దాఖలు చేసి తనకు న్యాయం చేయండి అంటూ విజ్ఞప్తి చేయడం వంటివి ముందస్తు బెయిల్ కు పిటీషన్ పెట్టుకోవడం వంటివి చూస్తుంటే సుశాంత్ కేసు విషయంలో ఆమె చాలా భయపడుతున్నట్లుగా అనిపిస్తుంది.ఇక ఆమె మీడియా ముందుకు వచ్చేందుకు మొన్నటి వరకు నిరాకరించింది.
ఎట్టకేలకు రియా మీడియా ముందుకు వచ్చి నోరు విప్పింది.
జాతీయ మీడియా సంస్థలకు ఆమె వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ తనపై ఉన్న అపవాదులను మరియు తనపై వస్తున్న విమర్శలకు సమాధానం ఇస్తుంది.
సుశాంత్తో తన ప్రేమ విషయం నిజమే అంటూ చెప్పిన రియా పలు ఆసక్తికర విషయాలను వెళ్లడి చేసింది.సుశాంత్ గత ఏడు సంవత్సరాలుగా డిప్రెషన్ కు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు.
అందుకు ఆయన మాత్రలు కూడా తీసుకుంటున్నాడు.మేము గత ఏడాది అక్టోబర్ లో యూరప్ వెళ్లిన సమయంలో ఆయన పరిస్థితి మరీ క్షీణించింది.
అక్కడ మేము ఉన్న హోటల్ గది ఒక గుహ మాదిరిగా ఉండటంతో పిచ్చి కలలు వస్తున్నాయని భయపడేవాడు.
సుశాంత్కు విమానం ఎక్కడం అంటే ఎక్కువ భయం అంది.ఇరుకుగా ఉండే ప్రదేశాలు, ఇసుక పైకి లేచే ప్రాంతాలు అంటే భయం అంటూ సుశాంత్ నాతో చెప్పాడు.దాని నుండి బయట పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాను అన్నాడు.
సుశాంత్ డబ్బు నేను వాడుకున్నట్లుగా వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదని క్లారిటీ ఇచ్చింది.నేను చిన్నప్పటి నుండే లగ్జరీగా పెరిగాను నాకు సుశాంత్ డబ్బులతో అవసరం లేదు.
నేను సంపాదించుకుంటున్నాను కదా అంటూ ఆమె ప్రశ్నించింది. రియా తనపై వచ్చిన ప్రతి ఆరోపణకు సమాధానం చెబుతున్నా కూడా ఆమెను నెట్టింట ట్రోల్స్ చేయడం మాత్రం మానడం లేదు.