గతేడాది సుశాంత్ సింగ్ ఆత్మహత్య అనంతరం రియా చక్రవర్తి పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిన సంగతి తెలిసిందే.తెలుగులో రియా చక్రవర్తి తొమ్మిదేళ్ల క్రితం తూనీగ తూనీగ సినిమాలో నటించగా ఆ సినిమా ఫ్లాప్ కావడంతో ఆ సినిమా తరువాత పెద్దగా అవకాశాలు రాలేదు.
ఆ తరువాత రియాకు బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు రావడం ఆమె బాలీవుడ్ కే పరిమితం కావడం జరిగింది.అయితే సుశాంత్ సింగ్ మృతి చెందిన తరువాత మొదట్లో ఆమెపై నెగిటివ్ కామెంట్లు వ్యక్తమయ్యాయి.
అయితే రోజులు గడిచే కొద్దీ రియా చక్రవర్తిపై ప్రేక్షకుల నుంచి సింపతీ వ్యక్తమవుతోంది.డ్రగ్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో కొన్ని నెలలు జైలు జీవితం గడిపిన ఆ తరువాత బెయిల్ పై విడుదలయ్యారు.
సుశాంత్ ఆత్మహత్యకు రియానే కారణమని కూడా గతంలో ఆరోపణలు వ్యక్తమైనా సుశాంత్ డిప్రెషన్ తో బాధ పడుతున్నాడని తేలడంతో సుశాంత్ ఆత్మహత్య విషయంలో ఇప్పటికీ అనేక సందేహాలు నెలకొన్నాయి.
అయితే ఇప్పుడు రియా చక్రవర్తిపై అభిమానుల్లో సానుభూతి వ్యక్తమవుతోంది.తన తప్పు ఏం లేకపోయినా రియా చక్రవర్తి అనవసర వివాదాల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతోందని ప్రేక్షకులు భావిస్తున్నారు.మరోవైపు ఆమెకు బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తోంది.
రియా కూడా గతాన్ని మరిచిపోయి మళ్లీ కెరీర్ పై దృష్టి పెట్టారు.
అయితే వస్తున్న ఆఫర్లను తిరస్కరించకుండా ప్లాన్ చేసుకుని డేట్స్ కేటాయిస్తానని ఆమె చెప్పినట్టు సమాచారం.
రియాను తమ సినిమాల్లో నటింపజేయడానికి నిర్మాతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.టాలీవుడ్ కు చెందిన ఇద్దరు ప్రముఖ నిర్మాతలు రియాను నటింపజేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.
రియాపై ఉన్న సానుభూతిని నిర్మాతలు క్యాష్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.