బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య కేసులో బీహార్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.సుశాంత్ సింగ్ రాజపుత్ తంరీ ఫిర్యాదు మేరకు ఈ కేసును వేగవంతం చెయ్యగా నిన్న శనివారం ప్రత్యేక పోలీసు బృందం ముంబైకి వెళ్లిందని డీజీపీ గుప్తేశ్వర్ పాండే తెలిపారు.
సుశాంత్ ఆత్మహత్యకు సంబంధించి పలు కీలకా అధరాలు సేకరించినట్టు అయన తెలిపారు.
అంతేకాదు అతని స్నేహితులు, సహచరులు, బంధవులను మృతికి సంబంధించి సమాచారాన్ని తెలుసుకున్నారు అని వారు తెలిపారు.
కాగా ముంబైలో ఉన్న బీహార్ పోలీసుల బృందం సుశాంత్ సోదరిని, మాజీ ప్రేయసి అంకితా లోఖండే, అతని వంట మంది, పలువురు స్నేహితుల వాంగ్మూలం తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
వీరందరి వాగ్మూలం సేకరించిన పోలీసులకు సుశాంత్ సింగ్ రాజపుత్ ప్రేయసి అయినా రియా చక్రవర్తి ఎక్కడ ఉన్నారో తెలియదు అని, ఆమె ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదని వారు అన్నారు.
ప్రస్తుతం రియా చక్రవర్తి మిస్సింగ్ అని పోలీసులు చెప్తున్నారు.కాగా సుశాంత్ బ్యాంక్ అకౌంట్, ట్రాన్జాక్షన్స్ సమాచారాన్ని బ్యాంకు నుంచి డీజీపీ తెలిపారు.
రియా చక్రవర్తి సుశాంత్ బ్యాంక్ ఖాతా నుంచి 15 కోట్ల రూపాయలు కాజేసిందని తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.