ఇటీవలే బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మానసిక ఒత్తిళ్లను తట్టుకోలేక తన సొంత నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఎక్కువ మంది అభిమానులు సుశాంత్ సింగ్ ఆత్మ హత్య చేసుకోవడానికి అతని ప్రియురాలు రియా చక్రవర్తి కారణమని అనుమానిస్తున్నారు.
అంతేగాక తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తండ్రి కూడా తన కొడుకు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం తన ప్రియురాలు రియా చక్రవర్తి అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అయితే ఇంతకీ విషయం ఏంటంటే ప్రస్తుతం రియా చక్రవర్తి తెలుగులో “సూపర్ మచ్ఛి” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి అల్లుడు “కళ్యాణ్ దేవ్” హీరోగా నటిస్తున్నాడు.అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి కొన్ని సన్నివేశాల చిత్రీకరణ పనులు కూడా పూర్తయ్యాయి.
కాగా ఇటీవలే రియా చక్రవర్తి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది.దీంతో చిత్ర యూనిట్ సభ్యులు కొంతమేర ఆందోళన చెందుతున్నారు.
అంతేగాక ఆమె స్థానంలో కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ఓ హీరోయిన్ ని తీసుకున్నట్లు సమాచారం.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో తాను నిర్దోషినని ఆన్ లైన్ ద్వారా లైవ్ కార్యక్రమం నిర్వహించి రియా చక్రవర్తి తెలిపింది.
అంతేకాక కచ్చితంగా తనకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.కాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తండ్రి తెలియజేసిన వివరాల మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు గత నాలుగు నెలలుగా రియా చక్రవర్తి సుశాంత్ సింగ్ నుంచి దాదాపుగా 45 కోట్ల రూపాయలకు పైగా తన ఖాతాలో జమ చేయించుకున్నట్లు కనుగొన్నారు.
దీనికి తోడు రియా చక్రవర్తి తన కేసును వాదించడం ఖరీదైన లాయర్ నియమించుకోవడంతో మరిన్ని అనుమానాలు బలపడ్డాయి.
.