బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత ఎక్కువగా అందరిదృష్టిలో పడిన కథానాయిక రియా చక్రవర్తి.తెలుగులో తూనీగ తూనీగ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.ఈ క్రమంలో ఓ అరడజను సినిమాలు వరకు చేసింది.సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో జిలేబి అనే సినిమాలో చేసింది.ఈ మూవీ తర్వాత నుంచి ఇద్దరు కూడా రిలేషన్ షిప్ లో ఉండేవారు.ఇక సుశాంత్ మరణానికి కొద్ది రోజుల ముందు వరకు రియా చక్రవర్తి అతనితోనే కలిసి ఉంది.
ఆమె వెళ్ళిపోయిన కొద్దిరోజుల తర్వాత సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు.దీంతో అతని మృతికి రియా చక్రవర్తి కారణమని చాలా మంది విమర్శలు చేశారు.
సుశాంత్ తండ్రి కూడా రియాపై తీవ్ర ఆరోపణలు చేశారు.ఈ వ్యవహారంలో ఒక్కసారిగా అందరి దృష్టి రియా చక్రవర్తి మీద పడింది.ఇక సుశాంత్ ఆత్మహత్యపై విచారణలో డ్రగ్స్ వ్యాపారం కూడా వెలుగు చూసింది.దీంట్లో రియా చక్రవర్తి పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చింది.
ఇక ఈ కేసులో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.ప్రస్తుతం బెయిల్ పై బయటకు వచ్చింది.ఇది ఎలా ఉంటే మరల రియా చక్రవర్తి హీరోయిన్ గా బిజీ అయ్యే ప్రయత్నం చేస్తుంది.ఆ సంఘటన నుంచి బయటపడడానికి అవకాశాల కోసం వెతుకుతుంది.ఈ క్రమంలో సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో టాలీవుడ్ లో రెండో సినిమా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది.రానా దగ్గుబాటి ఈ మూవీని నిర్మిస్తున్నట్లు సమాచారం.
త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తున్న మాట.