బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో డ్రగ్స్ కు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్ రియా చక్రవర్తికి నేడు ముంబై హైకోర్టు బెయిల్ ను మంజూరు చేసింది.సెప్టెంబర్ 8నుంచి రియా చక్రవర్తి జైల్లోనే ఉంది.
అయితే ఇదే కేసులో అరెస్ట్ అయిన ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తికి మాత్రం బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.ప్రత్యేక కోర్టు నిన్న వారి కస్టడీని అక్టోబర్ 20 వరకు పొడిగించిన నేపథ్యంలో రియా, ఆమె సోదరుడు షోవిక్ బాంబే హైకోర్టును అప్రోచ్ అయ్యారు.
అయితే రియాకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు, ఆమె సోదరుడికి బెయిల్ ఇవ్వలేదు.అయితే , రియా ముంబై విడిచి వెళ్లరాదని, లక్ష రూపాయల పూచీకత్తు సమర్పించాలని , ప్రతి పదిరోజులకి పోలీస్ స్టేషన్ కి వెళ్లి సంతకం చేయాలనీ కోర్టు తెలిపింది.
జూన్ 14 న ముంబైలోని తన అపార్ట్మెంట్ లో అనుమానాస్పద రీతిలో మరణించిన ప్రముఖ సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కోసం డ్రగ్స్ లావాదేవీలు జరిపిన ఆరోపణలపై రియా చక్రవర్తిని సెప్టెంబర్ 8 న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.ఇక , ఇదే కేసులో అరెస్టు అయిన సుశాంత్ సింగ్ ఉద్యోగులు.
శామ్యూల్ మిరిండా, దీపేశ్ సావంత్లకు ముంబై హైకోర్టు బెయిల్ ఇచ్చింది.