బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఎంత పెద్ద సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.సినీ పరిశ్రమ మొత్తాన్ని శోకసంద్రంలో ముంచి.
తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన సుశాంత్ ఎందుకు చనిపోయాడు అన్నది ఇప్పటికీ వీడని మిస్టరీగానే కొనసాగుతోంది.మొదట మానసిక ఒత్తిడి వల్లే సుశాంత్ సూసైడ్ చేసుకున్నాడని ప్రచారం జరిగినప్పటికీ.
ఆ తర్వాత మాత్రం సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తినే కారణమని అంటున్నారు.
ప్రస్తుతం సీబీఐకి వెళ్లిన ఈ కేసు శరవేగంగా ముందుకు సాగుతోంది.
సీబీఐ అధికారులు కూడా రియా చక్రవర్తిని మరియు ఆమె కుటుంబసభ్యులను తమదైన శైలిలో ఇంటరాగేట్ చేస్తున్నారు.ఇక సుశాంత్ కేసు పక్కన పెడితే.మరో కేసులో రియా అడ్డంగా ఇరుక్కోనున్నట్టు ప్రచారం జరిగుతోంది.ఇటీవల రియాకి డ్రగ్స్ డీలర్ తో సంబంధం ఉన్నట్లుగా.
ఆ వ్యక్తితో వాట్సాప్ ద్వారా చాటింగ్ చేసినట్లుగా వెళ్లడి అయిన సంగతి తెలిసిందే.
ఈ కేసుపై ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు.
మరోవైపు దీనిపై రియా తరుపు ఉన్న లాయర్ మాట్లాడుతూ.తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు.
రియాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పరీక్షలు చేసుకోవచ్చు.ఆమె అందుకు సిద్ధంగా ఉందని తేల్చి చెప్పారు.
అయితే రియా డ్రగ్స్ తీసుకోకున్నా.సప్లైకి సంబంధించిన వ్యవహారంలో సహకరించి ఉందవచ్చని పులువురు భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే సుశాంత్ కేసు నుంచి బయటపడినా.డ్రగ్స్ కేసులో మాత్రం రియాకు జైలు తప్పదంటూ ప్రచారం ఊపందుకుంది.
కాగా, సుశాంత్ మర్డర్ మిస్టరీ వీడిన తర్వాత.రియాను డ్రగ్స్ కేసులో విచారించనున్నట్టు తెలుస్తోంది.