బాలీవుడ్ లో డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ విచారణలో ఆమె మొత్తం 25 మంది ప్రముఖుల పేర్లు చెప్పిందని ప్రచారం జరుగుతుంది.
అందులో రకుల్ ప్రీత్ సింగ్ ప్రముఖంగా వినిపిస్తుంది.ఇక ఈ పేరు ప్రచారంలోకి రావడమే ఆలస్యం అన్నట్లుగా తెలుగు మీడియా రకుల్ చుట్టూ డ్రగ్స్ కథనాలు సిద్ధం చేసి వాటిని టాలీవుడ్ కి లింక్ పెట్టి కొంత మంది సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిని, సామాజిక సంఘాలకి చెందిన వారిని కూర్చోబెట్టి డిబేట్లు మొదలు పెట్టాయి.
ఇక ఈ డిబేట్లలో వారికి తోచింది నచ్చినట్లు చెప్పడానికి రెడీ అయిపోయే మేధావులు రకుల్ ని టార్గెట్ చేస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని డ్రగ్స్ వ్యవహారంలోకి లాగేసే ప్రయత్నం చేశారు.మీడియా చానల్స్ రేటింగ్స్ కూడా ఈ రకుల్ ని తెగ వాడేసుకున్నాయి.
అయితే విచారణలో రియా ఎవరి పేర్లు బయట పెట్టలేదని ఎన్సీబీ కీలక ప్రకటనలో పేర్కొంది.
డ్రగ్స్ కేసులో రియా ఎవరి పేర్లనూ చెప్పలేదంటూ, తమ వద్ద నిందితులు, బాధితుల జాబితా ఏమీ లేదంటూ ఎన్సీబీ ప్రకటనలో స్పష్టం చేసింది.
ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా ఈ ప్రకటన విడుదల చేశారు.రియా నోటి నుంచి ఎవరి పేర్లూ రాలేదని స్పష్టం చేశారు.తాము కేవలం డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారి జాబితానే తయారు చేశామని, దాన్నే సినీ పరిశ్రమ జాబితాగా పొరపడ్డారేమోనని అన్నారు.సినీ పరిశ్రమపై జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రమూ నిజం లేదని ఈ ప్రకటనలో కేపీఎస్ మల్హోత్రా పేర్కొనడం గమనార్హం.
మొత్తానికి ఎన్సీబీ అధికారులు ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వాత అయిన రకుల్ పేరుని మీడియా వాడుకోవడం ఆపుతుందేమో చూడాలి.