మరోసారి సుప్రీం కోర్టుని ఆశ్రయించిన రియా చక్రవర్తి

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఘటనలో అన్ని వెళ్ళు అతని ప్రియురాలు రియా చక్రవర్తి  వైపు చూపిస్తున్నాయి.ఆమె ప్లాన్ చేసి అతనిని హత్య చేసిందని కొందరు ఆరోపిస్తూ ఉంటే మరికొందరు ఆమె ప్లాన్ ప్రకారం అతను డిప్రెషన్ లోకి వెళ్ళేలా చేసి అతని సంపాదన అంతా తన ఎకౌంటు లోకి బదిలీ తనకు తానుగా ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించింది అని ఆరోపిస్తున్నారు.

 Rhea Chakraborty Approaches Sc Over Media Troll, Sushant Singh Rajput, Bollywood-TeluguStop.com

ఇక సుశాంత్ తండ్రి కూడా తన కొడుకు ఆత్మహత్యకి రియా కారణం అని ఫిర్యాదు చేశారు.ఆ ఫిర్యాదు ఆధారణంగా ఇప్పుడు సీబీఐ విచారణ మొదలైంది.

తాజాగా సుశాంత్ బ్యాంకు ఖాతాల నుంచి 50 కోట్లు మాయం కావడంపై ఈడీ రియాని ఇప్పటికే రెండు దఫాలుగా ప్రశ్నించింది.ఇలా రియా సుశాంత్ వ్యవహారంలో పూర్తిగా లాక్ అయిపొయింది.

ఇదిలా ఉంటే ఇప్పటికే సుశాంత్ కేసుని పాట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలని కోరుతూ ఆమె సుప్రీం కోర్టుని ఆశ్రయించింది.అయితే న్యాయస్థానం ఆ కేసుని కొట్టేసింది.

అయితే ఆమె మరోసారి సారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారంలో తనను బాధ్యురాల్ని చేస్తూ, మీడియాలో దారుణమైన రీతిలో కథనాలు వస్తున్నాయని ఆరోపిస్తూ తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తనపై అసత్య ఆరోపణలు చేస్తూ, తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రియా పిటిషన్ లో కోరింది.మరి రియా పిటిషన్ ని న్యాయస్థానం ఎంత వరకు పరిగణంలోకి తీసుకుంటుందో అనేది ఇప్పుడు చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube