బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి తరువాత ఆయన మృతి కేసులో అనేక ట్విస్టులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.సుశాంత్ మృతి తరువాత వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు రియా, ఆమె సోదరుడి మెడకు చుట్టుకుంది.
సుశాంత్ మృతితో రియాకు సంబంధం లేకపోయినా డ్రగ్స్ కేసు వల్ల రియా పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది.అదే సమయంలో రియాకు వ్యతిరేకంగా పలువురు సెలబ్రిటీలు వ్యాఖ్యలు చేశారు.
కొన్ని రోజుల క్రితం డ్రగ్స్ కేసులో రియాకు బెయిల్ లభించగా ఆమె సోదరుడు షోవిక్ కు మాత్రం కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు.మరోవైపు డ్రగ్స్ కేసుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న పలువురు సెలబ్రిటీలను సైతం ఈ కేసులో ఎన్సీబీ అధికారులు విచారించారు.
అయితే కేసులో రియాకు ఖచ్చితంగా శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డ్రగ్స్ కేసు వల్ల రియాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు సైతం తీవ్ర మనోవేదనకు గురయ్యారు.
ఒక దశలో రియా తల్లి ఆత్మహత్యాయత్నం చేసిందంటే రియాపై మోపిన అభియోగాలు ఆమెను ఎంతగా బాధించాయో అర్థమవుతుంది.అయితే తన తప్పేం లేకపోయినా కొందరు చేసిన వ్యాఖ్యలు తన పరిస్థితికి కారణమని రియా భావిస్తోంది.
తన పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన సుశాంత్ మాజీ ప్రేయసి అంకిత లోఖండే, సుశాంత్ తనను డ్రాప్ చేసినట్లు సీబీఐ అధికారులకు చెప్పి తరువాత మాట మార్చిన పొరుగింటి మహిళ, మరి కొంతమందిపై రియా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
తనను, తన కుటుంబాన్ని మానసిక వేదనకు గురి చేసిన ప్రతి ఒక్కరిపై ప్రతీకారం తీర్చుకోవడానికి రియా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
రియా చట్టపరంగా చర్యలు తీసుకుంటే మాత్రం తనపై ఆరోపణలు చేసిన వాళ్లకు భారీ ఝలక్ ఇచ్చినట్టేనని చెప్పవచ్చు.