బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.సీబీఐ ఈ కేసుపై విచారణ జరుపుతుండగా ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
తాజాగా సుశాంత్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.నటి రియా చక్రవర్తి సుశాంత్ సింగ్ సోదరి ప్రియాంక సింగ్పై ముంబై పోలీస్ స్టేషన్ లో ఆరు పేజీలతో ఫిర్యాదు చేసింది.
రియా చక్రవర్తి ఈ ఫిర్యాదులో ప్రియాంక తన సోదరుడు సుశాంత్ సింగ్ కు చట్టవిరుద్ధమైన సైనోట్రోఫిక్ పదార్థాలను సూచించిందని… ఆ పదార్థాలను తీసుకున్న కొన్ని రోజులకే సుశాంత్ మరణించాడని… ఆ పదార్థాల వల్లే సుశాంత్ మరణించి ఉండవచ్చని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు.రియా ఫిర్యాదుతో కేసులో కీలక మలుపు చోటు చేసుకుందనే చెప్పాలి.
ఇప్పటివరకు సుశాంత్ మృతి కేసులో రియా వైపే అనుమానాలు వ్యక్తం కాగా తాజా ఘటనతో సుశాంత్ మృతిలో ప్రియాంక పాత్ర ఉందా.? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రియా ఫిర్యాదులో ప్రియాంకతో పాటు డాక్టర్ తరుణ్ కుమార్ పై కూడా కేసు నమోదు చేయడం గమనార్హం.కొన్ని రోజుల క్రితం ప్రియాంకకు సంబంధించిన చాట్ లీక్ అయింది.
ఆ చాట్ లో సుశాంత్ డిప్రెషన్ గురించి ప్రియాంకకు ముందే తెలుసని వెల్లడైంది.లిబ్రియమ్(క్లోర్డియాజిపోక్సైడ్), నెక్సిటో లాంటి మందులను వాడాలని ప్రియాంక సుశాంత్ కు చాట్ లో సూచించింది.
అయితే డాక్టర్ తరుణ్ మాత్రం సుశాంత్ కుటుంబ సభ్యులు కోరితేనే తాను మందులు రాసిచ్చానని చెబుతున్నాడు.