టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో నటించినా సినిమాల కంటే స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రేయసిగానే రియా చక్రవర్తి గుర్తింపును సంపాదించుకున్నారు రియా చక్రవర్తి.సుశాంత్ సింగ్ మృతి తరువాత డ్రగ్స్ కేసు ద్వారా రియా చక్రవర్తి వార్తల్లో నిలిచారు.
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన తరువాత గతేడాది అక్టోబర్ నెలలో రియాకు బెయిల్ లభించింది.బెయిల్ వచ్చిన తరువాత రియా మీడియాకు దూరంగా జైలు జీవితం గడుపుతున్నారు.
అయితే ముంబై లోని బాంద్రా రోడ్డులో రియా చక్రవర్తి ప్రత్యక్షం కావడంతో కొంతమంది రియాను గుర్తు పట్టి ఆమెను ఫోటోలు, వీడియోలు తీశారు.తనను ఫోటోలు, వీడియోలు తీయడంతో అసౌకర్యానికి గురైన రియా తనను ఫాలో కావద్దు వీడియోలు తీయవద్దు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దండం పెడుతూ రియా చేసిన కామెంట్లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.రియా చక్రవర్తి పూల బొకేను కొనుగోలు చేయడానికి వెళ్లారు.నేడు సుశాంత్ పుట్టినరోజు కావడంతో రియా బొకేను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
రియా బొకేను కొన్న తరువాత కొంతమంది వీడియోలు తీయగా హిందీలో ఆబ్ మెయిన్ జా రాహి హూన్, పీచే మాట్ ఆనా అని రియా అన్నారు.బ్లాక్ లెగ్గింగ్, గ్రే కలర్ టీషర్ట్ లో రియా కనిపించారు.సుశాంత్ మృతి తరువాత వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తితో పాటు చాలామంది బాలీవుడ్ ప్రముఖులను ఎన్సీబీ అధికారులు విచారించారు.
ఆమె విచారణలో చాలామంది ప్రముఖుల పేర్లను వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి.
రియాతో పాటు ఎన్సీబీ అధికారులు ఆమె సోదరుడు షోవిక్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
మరోఐపు సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు సరైన కారణాలు మాత్రం వెల్లడి కాలేదు.డ్రగ్స్ కేసు వెలుగులోకి రావడంతో సుశాంత్ కేసు పక్కదాని పట్టిందని నేటికీ కొంతమంది అభిమానులు ఆరోపణలు చేస్తున్నారు.
.