దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి ఇంకా మిస్టరీగానే కొనసాగుతోంది.రోజుకో మలుపు తిరుగుతున్న సుశాంత్ కేసు.
ఉత్కంఠబరితంగా మారింది.ఇటు ముంబై పోలీసులు.
అటు బీహార్ పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేస్తున్నాయి.పలువురు బాలీవుడ్ ప్రముఖుల్ని విచారించారు.
సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని కూడా పోలీసులు విచారించారు.అయినప్పటికీ కేసు ఓ కొలిక్కి రాలేదు.
ఇక ఇటీవల సుశాంత్ తండ్రి.రియా చక్రవర్తిపై కేసు నమోదు చేసి.సుశాంత్ ఎకౌంట్లు డబ్బులు మాయం అవ్వడం పట్ల అనేక సందేహాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.దీంతో ఈ కేసు మరింత వాడి వేడిగా ముందుకు సాగుతోంది.
అయితే బీహార్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుంచి ఆమె కనిపించకుండా పోయింది.ఆమె ఎక్కడ ఉందో తెలుసుకోలేకపోతున్నామని ఆ రాష్ట్ర డీజీపీ గుప్తేశ్వర్ పాండే కూడా అన్నారు.
అయితే ఎట్టకేలకు రియా చక్రవర్తి అజ్ఞాతం వీడి.ముంబైలోని ఈడీ ఆఫీస్లో శుక్రవారం ప్రత్యక్షమైంది.సుశాంత తండ్రి ఆరోపణలతో రియాపై ఈడీ కూడా కేసు నమోదు చేసింది. సుశాంత్ బ్యాంక్ అకౌంట్ల నుంచి కోట్లాది రూపాయలు ట్రాన్స్ ఫర్ కావడంపై ఈడీ విచారించనుంది.
ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని రియాకు నోటీసులు జారీ చేసింది.
దీంతో రియా సుప్రీంలో తన పిటిషన్ తదుపరి విచారణకు వచ్చేవరకూ తన స్టేట్మెంట్ రికార్డ్ను వాయిదా వేయాలని కోరింది.
కానీ, అందుకు ఈడీ అధికారాలు ఒప్పుకోలేదు.ఖచ్చితంగా ఇవాళ ఉదయం ఈడీ కార్యాలయానికి హాజరు కావాలని మరో సారి ఆదేశాలు జారీ చేశారు.
దీంతో చేసేదేమి లేక రియా ముంబైలోని ఈడీ కార్యాలయానికి హాజరైంది.ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నట్టు తెలుస్తోంది.