ఎప్పుడు వివాదాలకి కేరాఫ్ అడ్రెస్స్ గా ఉండే ఆర్జీవీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సొసైటీలో జరుగుతున్న విషయాల మీద ఫన్నీగా స్పందిస్తూ ఉంటాడు.ఆర్జీవీ స్పందిస్తే ఆ ట్వీట్ వెంటనే వైరల్ అవుతుంది.
ఇప్పుడు ఆర్జీవీకి ఇంటరెస్టింగ్ గా కరోనా వైరస్ కనిపించింది.గత కొద్ది రోజులుగా ఈ కరోనా వైరస్ మీద ఫన్నీ గా కామెంట్స్ పోస్ట్ చేస్తూ ఉన్నాడు.
తాజాగా మరో ఆసక్తికరమైన ట్వీట్ కరోనాపై వర్మ చేశాడు.కరోనా వైరస్తో అందరూ సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంటున్నారని, దీనితో 99.999 శాతం పెళ్లైన జంటలు సంతోషంగా ఉన్నారని కొద్దిరోజుల క్రితం వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.తాజాగా కరోనావైరస్ని బాహుబలి సినిమా రికార్డులు బ్రేక్ చేస్తుందని ట్వీట్ పోస్ట్ చేశారు.
బాహుబలి-2 క్యూలైన్లను కరోనా మించి పోయిందంటూ ఫన్నీగా స్పందించారు.కరోనా కారణంగా అన్ని దేశాలలో పబ్లిక్ ప్రైవేట్ వ్యవస్థలు స్తంభించిపోతున్నాయి.విద్యా, వ్యాపార సంస్థలు, మాల్స్ మూతపడ్డాయి.ఐతే రాబోయే రోజుల్లో కరోనా ప్రభావం మరింత తీవ్రంతా ఉండబోతుందన్న వార్తలతో అమెరికన్లు ముందుగానే జాగ్రత్త పడుతున్నారు.
నెల రెండు నెలలకు సరిపడా నిత్యావసరాలు తెచ్చిపెట్టుకునేందుకు సిద్ధమయ్యారు.దీంతో పెద్ద ఎత్తున తరలి వచ్చి వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఓ సూపర్ మార్కెట్ వద్ద కిలోమీటర్ల మేర క్యూ కనిపించింది.ఈ వీడియోనే వర్మ షేర్ చేసి బాహుబలి బాహుబలి-2 టికెట్ల క్యూలైన్లను ఈ కరోనా భయం మించిపోయిందని సరదాగా కామెంట్ చేశారు.