రామ్ గోపాల్ వర్మ పేరు, ఆయన చేసే కామెంట్ల గురించి బయట పడితే చాలు అది క్షణాల్లో వైరల్ గా మారాల్సిందే.ఎందుకంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో వర్మ స్టైలే వేరు.
ఆయన చెప్పిందే సత్యం అంటాడు.ఆయన చేసేదే కరెక్ట్ అని అనుకుంటాడు.
అలా రామ్ గోపాల్ వర్మ ప్రతి ఒక్క విషయంలో హాట్ టాపిక్ గా నిలుస్తాడు.ఇదిలా ఉంటే తాజాగా రియల్ లీడర్ కు, రీల్ లీడర్ కు మధ్య తేడా చెబుతూ మరీ వైరల్ గా మార్చాడు.
ఇంతకూ అసలేం చేశాడో తెలుసుకుందాం.
టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా రామ్ గోపాల్ వర్మ మంచి పేరు సంపాదించుకున్నాడు.
ఈయన ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి ఎంతో మంది హీరోలను స్టార్ లుగా మార్చాడు.అంతేకాకుండా ఎంతోమంది నటీనటులకు ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అన్ని మంచి సక్సెస్ ను అందుకున్నాయి.
కానీ ఈ మధ్య వర్మ స్టైల్ మొత్తం మారిపోయింది.
తనలోనే కాదు సినిమా విషయంలో కూడా వర్మ మొత్తం స్టైల్ మారుస్తూ బాగా కాంట్రవర్సీలు ఎదుర్కొంటున్నాడు.ఈ మధ్య మొత్తం కొత్త నటీనటులతో కొత్త కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
అంతే కాకుండా సమాజంలో జరిగే కొన్ని విషయాలను కూడా తన కథలోని చేర్చుకొని బాగా వైరల్ గా మారుస్తుంటాడు.
ఇక రాజకీయ నాయకులను కూడా బాగా దృష్టిలో పెట్టుకొని వాళ్ల నేపథ్యంలో కూడా సినిమాలను తెరకెక్కిస్తాడు.వర్మ దర్శకుడిగా కంటే సోషల్ మీడియాలో షేర్ చేసే పోస్టుల వల్ల మరింత పరిచయాన్ని పెంచుకున్నాడు.ఆయన చేసే పోస్టులు మాత్రం అందర్నీ ఆశ్చర్య పరుస్తాయి.
ఒక్కోసారి వివాదాలను కూడా సృష్టిస్తాయి.
కానీ వర్మ మాత్రం వాటిని అస్సలు పట్టించుకోడు.
తనకు ఏది అనిపిస్తే అదే చేస్తాడు.ఇక సెలబ్రిటీలతో దిగిన ఫోటోల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
వర్మ తనను ఇంటర్వ్యూ చేసే అమ్మాయిలపై బోల్డ్ కామెంట్స్ చేస్తూ నోటిమీద వేలేసుకునేలా చేస్తాడు.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా మరో పోస్ట్ చేసి అందరి దృష్టిని తాకాడు.
తన దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్జీవీ మిస్సింగ్ అనే ట్రైలర్ తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే.దీంతో ఈయన ట్రైలర్ చూసి చంద్రబాబు నాయుడు ఏడ్చాడు అంటూ ఓ కామెంట్ చేశాడు.తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నుంచి వాకౌట్ అవుతున్న నేపథ్యంలో బాగా ఎమోషనల్ అయ్యాడు.
దీంతో వర్మ చంద్రబాబు ఎమోషనల్ ను తన సినిమాకు వర్తించేలా విధంగా ఎడిట్ చేసి కాస్త ఫన్నీ క్రియేట్ చేశాడు.అంతేకాకుండా రియల్ లీడర్, రీల్ లీడర్ అనే ఓ క్యాప్షన్ ఇస్తూ అందులో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్, చంద్రబాబు ఎమోషనల్ వీడియోను ఎడిట్ చేసి మరి ట్విట్టర్ వేదికగా వారి మధ్య తేడా చెబుతూ షేర్ చేశాడు.
దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారడంతో నెటిజన్లు ఈ వీడియోను చూసి తెగ కామెంట్లు పెడుతున్నారు.
మొత్తానికి చంద్రబాబు ఎమోషనల్ వీడియో తో రకరకాల మీమ్స్ క్రియేట్ చేస్తూ బాగా వైరల్ గా మారుస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ.