ఎప్పుడు వివాదాలతో వార్తల్లో నిలిచే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రామ్ గోపాల్ వర్మ అంటూ అందరూ ఒకే ఆన్సర్ చెబుతారు.ఈయన తాజాగా మరో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వార్తల్లో నిలిచేలా ప్రయత్నం చేశాడు.
ఈయన ఆర్ఆర్ఆర్ అంటే వైఎస్ఆర్సిపి రెబల్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజుతో కలిసి రామ్ గోపాల్ వర్మ ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు.ఈ ఫోటోలను ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఆర్ఆర్ఆర్+ ఆర్ అంటూ బస్తీమే సవాల్ అని షేర్ చేశారు.
ఇకపోతే గత కొన్ని రోజుల నుండి రామ్ గోపాల్ వర్మ వైఎస్ఆర్సిపి పార్టీతో మంచి స్నేహబంధాన్ని కొనసాగిస్తున్నట్లు కనబడుతోంది.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రోత్సహంతోనే ఆయన సినిమా లను చేస్తున్నట్లు కొంతమంది ఆరోపించారు.
ఇందులో భాగంగానే చంద్రబాబు నాయుడు, బాలయ్య బాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లను టార్గెట్ చేస్తూ లక్ష్మీస్ ఎన్టీఆర్ అలాగే ’అమ్మ రాజ్యంలో కడప బడ్డలు’ ఇంకా పవర్ స్టార్ పై తెరకెక్కించిన పవర్ స్టార్ అంటూ సినిమాలను తెరకెక్కించిన సంగతి అందరికీ తెలిసిందే.ఇకపోతే ఈ సినిమాల అన్నిటికీ కూడా రాంగోపాల్ వర్మ కు వైఎస్ఆర్సీపీ నాయకులు నిర్మాతగా వ్యవహరించారని జనసేన పార్టీ, టిడిపి నాయకులు కొందరు ఆరోపించిన సంగతి మనకు తెలిసిందే.
ఇకపోతే ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ, వైఎస్ఆర్సిపి ఎంపీ రఘురామ కృష్ణంరాజుతో ఫోటోలు దిగడంతో ఆ అంశం చర్చనీయాంశంగా మారిపోయింది.ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ ఆర్ఆర్ఆర్ అంటూ రఘురామకృష్ణం రాజును సంబోధించాడు.ఎవరు ఏమి చెప్పినా నా రూటే సపరేటు అనే రాంగోపాల్ వర్మ ఇప్పుడు ఈ విధంగా రఘురామకృష్ణరాజును సంబోధించడంతో మరింత ఆసక్తికరంగా మారింది.ఏది ఏమైనా రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎవరితో ఎలా ఉంటాడో చెప్పడం నిజంగా కష్టమే సుమా.