ఎన్టీఆర్ జీవితంలో కీలక ఘట్టాలని తీసుకొని వివాదాస్పద దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ కి పోటీగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే తెలుగు నాట మంచి క్రేజ్ వుంది.
ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్ తో ఆర్జీవి ప్రేక్షకులకి ఈ సినిమాపై వున్న అంచనాలని రెట్టింపు చేసేసాడు.అయితే సినిమా రిలీజ్ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయిన మార్చి ఫస్ట్ వీక్ లో తీసుకొచ్చే అవకాశం వుందని తెలుస్తుంది.
ఇదిలా వుంటే ఈ సినిమాలో వివాదాస్పదమైన వెన్నుపోటు అనే సాంగ్ ని గతంలో రిలీజ్ చేసిన వర్మ తాజాగా ఎన్టీఆర్, లక్ష్మి పార్వతి మధ్య అనుబంధాన్ని, ప్రేమని చూపించే విధంగా నువ్వు నా సర్వస్వం అనే వీడియో సాంగ్ ని రిలీజ్ చేసాడు.ఈ సాంగ్ ని ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ఆలపించడం విశేషం.
ఇక ఇందులో ఎక్కువగా ఎన్టీఆర్, లక్ష్మి పార్వతి మీద ఎలాంటి ఫీలింగ్ వుంది అనే విషయాన్ని ఆర్జీవి చూపించడం జరిగింది.ఇక ఈ సినిమాపై నందమూరి కుటుంబం ఇప్పటి వరకు స్పందించలేదు.
చంద్రబాబు అయితే ఈ సినిమా విషయంలో కాస్త టెన్సన్ గా వున్నట్లు తెలుస్తుంది.