లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంతో తెలుగు రాష్ట్రాలలో రాజకీయంగా సంచలనాలకి తెరతీసిన ఆర్జీవి.తాజా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.
అయితే సినిమా ల్యాగ్ ఎక్కువగా ఉంది అనే టాక్ వచ్చిన రియల్ స్టొరీ, చాలా మందికి కనెక్ట్ అయ్యే కథ కారణంగా పర్వాలేదనే టాక్ తో నడుస్తుంది.అయితే ఎన్నికల కారణంగా ఏపీలో రిలీజ్ కాకుండా లక్ష్మీస్ ఎన్టీఆర్ ని తెలుగు దేశం పార్టీ గట్టిగా అడ్డుకోగలిగింది.
ఇక ఈ సినిమాతో మాలీ ఫాంలోకి వచ్చిన వర్మ మరో వివాదాస్పద చిత్రానికి సిద్ధం అవుతున్నారు.
గతంలో శశికళపై సినిమా తీస్తానని ప్రకటించిన వర్మ తాజాగా ఆ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ను కూడా విడుదల చేశాడు.
దినికి సంబంధించి ట్విట్టర్లో ఆ పోస్టర్ను ట్వీట్ చేశాడు.తమిళ నాట సంచలనం సృష్టించిన జయలలిత మరణం ఆమె స్నేహితురాలిగా ఉన్న శశికళ రాజకీయంగా జయలలిత వారసురాలిగా తెరపైకి రావడం.
ఉదంతాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.ఇక ఈ సినిమా పేరును ‘శశికళ’ అని వర్మ ప్రకటించాడు.శశికళకు జైలు శిక్ష, మన్నార్గుడి మాఫియాలను హైలెట్ చేస్తూ ఈ చిత్రం కథనం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.మరి ఈ సినిమాతో వర్మ తమిళనాట ఎన్ని సంచలనాలకి కారణం అవుతాడో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.