టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లైగర్.ఈ సినిమాలో బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు గురువు పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.లైగర్ సినిమాను పూరిజగన్నాథ్ 125 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.
పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కబోతుండడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాకు హీరోయిన్ ఛార్మి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
తాజాగా కొత్త షెడ్యూల్ అమెరికాలోని లాస్ వెగాస్ లో ప్రారంభం అయ్యింది.అక్కడ విజయ్ మైక్ టైసన్ లపై కీలక సన్నివేశాలను,క్లైమక్స్ సీన్ లను చిత్రీకరిస్తున్నారు.
ఇదే విషయాన్ని ఈ చిత్ర బృందం ఫోటోల ద్వారా షేర్ చేసుకుంది. మైక్ టైసన్ తో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ ఫోటోలపై టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు.దర్శకుడు పూరీ జగన్నాథ్ అచ్చం మైక్ టైసన్ లా కఠినంగా ఉన్నాడని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.
వన్ అండ్ ఓన్లీ మైక్ టైసన్ తో లైగర్ ఫ్యామిలీ అని కాప్షన్ ఇచ్చారు.ఈ సినిమా కిక్ బాక్సింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోతోంది.
ఇందులో విజయ్ దేవరకొండ బాక్సర్ గా విభిన్నమైన లుక్ లో పొడవాటి జుట్టుతో కనిపించనున్నారు.