వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.కరోనా వైరస్ను సైతం లెక్కచేయకుండా తన సినిమాలను జెట్ స్పీడుగా తెరకెక్కిస్తూ రిలీజ్ చేస్తున్నాడు.
అయితే వర్మ తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.పవర్ స్టార్ అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో తెగ చర్చ సాగుతోంది.
ఇక వర్మ తన స్పీడును ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటున్నాడు.తన నెక్ట్స్ చిత్రాలను ఎవరిపై చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కాగా వర్మ ఈసారి మరికొంత మంది టాలీవుడ్ స్టార్స్పై పడ్డట్టు తెలుస్తోంది.గతంలో నందమూరి బాలకృష్ణ ఇంట్లో బెల్లంకొండ సురేష్పై జరిగిన కాల్పుల ఆధారంగా ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు వర్మ.
అటు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఫేక్ కలెక్షన్స్పై కూడా ఓ సినిమా చేసేందుకు వర్మ రెడీ అవుతున్నాడు.
మొత్తానికి ఈసారి పవన్పై పడ్డ వర్మ, తన నెక్ట్స్ చిత్రాలతో కూడా టాలీవుడ్ హీరోలను టార్గెట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
అసలు వర్మ ఇలాంటి సినిమాలు ఎప్పుడు తీస్తున్నాడు, ఇంత త్వరగా షూటింగ్ ఎలా ముగిస్తున్నాడే, ఎలా రిలీజ్ చేయగలుగుతున్నాడు అనే ప్రశ్నలకు సమాధానం మాత్రం ఇంకా ఎవ్వరికీ దొరకలేదు.మరి పవర్ స్టార్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయిన వర్మ, బాలయ్య, మహేష్ బాబుల చిత్రాలతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.