ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో టాలీవుడ్లోని పలువురు దర్శక నిర్మాతలు తమ ఇళ్ల వద్ద ఖాళీ గడుపుతుంటే రామ్ గోపాల్ వర్మ మాత్రం సమాజంలో జరుగుతున్నటువంటి వాస్తవిక సంఘటనల ఆధారంగా సినిమాలను తెరకెక్కిస్తూ వాటిని ఆన్ లైన్ ద్వారా విడుదల చేస్తూ జనాలను బాగానే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు.అయితే ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాల గూడ పరిసర ప్రాంతంలో జరిగినటువంటి ఓ వాస్తవిక సంఘటనల ఆధారంగా “మర్డర్” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.
అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన “నచ్చినోన్ని ప్రేమించడం తప్పా.?” అనే పాటని చిత్ర యూనిట్ సభ్యులు యూట్యూబ్ లో విడుదల చేశారు.ఈ పాటను విడుదల చేసిన 9 గంటల లోపే దాదాపు 92 వేల పైచిలుకు వ్యూస్ వచ్చాయి.ఈ వీడియో చూసి నటువంటి ఓ వ్యక్తి ఏకంగా “అప్పు చేసైనా సరే… రాంగోపాల్ వర్మ కి గుడి కట్టిస్తానని అంటూ కామెంట్ చేశాడు దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు రామ్ గోపాల్ వర్మ సినిమాలకి ఈ లాక్ డౌన్ సమయంలో ఎంత క్రేజ్ ఉందని.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే అమృత ప్రణయ్ కుటుంబ సభ్యులు ఈ చిత్రం విడుదలని నిలిపి వేయాలంటూ నల్గొండ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయినప్పటికీ రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ లో భాగంగా ఏదో ఒక పోస్టర్ లేదా వీడియోని విడుదల చేస్తున్నాడు.
అలాగే ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలంటూ కోర్టు పంపించిన నోటీసులకు కూడా రామ్ గోపాల్ వర్మ స్పందించనట్లు తెలుస్తోంది.
.