రామ్ గోపాల్ వర్మ ఈమద్య కాలంలో వారానికి ఒక సినిమా చొప్పున తీస్తూ విడుదల చేస్తున్నాడు.డిజిటల్ ఫార్మట్లో విడుదల అవుతున్న ఈ సినిమా అర్థగంటకు ఎక్కువ గంటకు తక్కువగా ఉంటున్నాయి.
ఈ సినిమాలు అన్ని కూడా చెత్తగా ఉన్నాయని టాక్ దక్కించుకున్నా కూడా వర్మ మాత్రం పట్టువదలని విక్రమార్కుడి మాదిరిగా ఫలితంతో నాకు ఏం సంబంధం అన్నట్లుగా సినిమాలు తీస్తున్నాడు.అప్పుడప్పుడు ఈయన కాంట్రవర్సీ సినిమాలను కూడా చేస్తున్నాడు.
పవర్ స్టార్ చిత్రంను తెరకెక్కించిన వర్మ ఆ సమయంలోనే ఆ రాత్రి ఏం జరిగిందంటే అంటూ ఒక సినిమాను తీస్తానంటూ ప్రకటించాడు.బాలకృష్ణ నిజ జీవితంకు సంబంధించిన ఒక సంఘటన ఆధారంగా ఆ సినిమాను తీస్తానంటూ చెప్పాడు.
ఆ రాత్రి ఏం జరిగిందో చాలా మందికి తెలియదు.అందుకే నేను ఆ సినిమాలో మొత్తం విషయాన్ని చెబుతాను అంటూ వర్మ ప్రకటించాడు.
కాని ఇప్పటి వరకు వర్మ ఆ సినిమా గురించి ఊసే ఎత్తలేదు.
నందమూరి ఫ్యాన్స్కు భయపడ్డాడా లేదంటే బాలయ్య నుండి ఫోన్ కాల్ వచ్చిందో కాని ఆ సినిమాను వదిలేశాడు.వర్మ ఆ సినిమాను వదిలేసి అల్లు అరవింద్ గురించి బావ రాజ్యంలో అంటూ ఒక సినిమాను మొదలు పెట్టాడు.అదే సమయంలో ఆర్జీవీ మిస్సింగ్ అంటూ ఒక సినిమాను కూడా తీస్తున్నాడు.
మొత్తానికి వర్మ నందమూరి ఫ్యామిలీ జోలికి వెళ్లక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.గతంలో వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని చేసిన విషయం తెల్సిందే.ఆ సినిమా సమయంలో దెబ్బ తిన్న కారణంగానే ఇప్పుడు ఆ రాత్రి ఏం జరిగింది సినిమాను వదిలేశాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.