ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో దివంగత ఎన్టీఆర్ హాట్ సబ్జెక్ట్గా మారారు.ఇప్పటికే ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ .
ఆయన జీవితాన్న రెండు భాగాలుగా తెరకెక్కించాడు.ఇప్పటికే మొదటి భాగం కథానాయకుడు విడుదలయ్యి ప్రేక్షాధారణ పొందింది.
రేపు మహానాయకుడు రిలీజ్ అవ్వనుంది.ఇక లక్ష్మీస్ ఎన్ఠీఆర్ తో ఇదే తరుణంలో రామ్ గోపాల్ వర్మ సెన్సేషన్ సృష్టించనున్నాడు.
బాలకృష్ణ హీరోగా చేస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లో తప్పులు చూపించారని వర్మ ఆరోపణ.శుక్రవారం మహానాయకుడు సినిమా రిలీజ్ కానుండగా… గురువారం సాయంత్రం ఏఎంబీ సినిమాస్ లో ప్రీమియర్ షో ఉంది.మహానాయకుడులో వెన్నుపోటు ఎపిసోడ్ని మేనేజ్ చేసి ఉంటారనే చర్చ విస్తృతంగా జరుగుతోంది.ఎన్టీఆర్ జీవితంలోని అతి ముఖ్యమైన ఆ భాగం చూపించకపోతే, అదసలు అన్నగారి చరిత్రే కాదనే అభిప్రాయం అభిమానుల నుంచి వ్యక్తమవుతోంది.
అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే విడుదలైన ట్రైలర్లో ఓ ఎజెండాతో అసలు విషయాన్ని పక్కన పెట్టినట్టు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
మహానాయకుడి సంబందించిన ఓ పోస్టర్ పోస్ట్ చేస్తూ వర్మ… మహానాయకుడులో రానా పర్ ఫార్మెన్స్ అదిరిపోయింది అని మెచ్చుకున్నాడు.రానా చేతిలో కత్తిని లాక్కుని బాలయ్య వెన్నులో పొడిచేందుకు వెయిట్ చేస్తున్నానని ట్యాగ్ లైన్ ఇచ్చాడు.అంటే అటు తిరిగి ఇటు తిరిగి… బాబు వెన్నుపోటు దగ్గరికే వచ్చాడు వర్మ.