మోదీని కూడా వదలని ఆర్జీవీ.. దీపావళికి ఇదే పెద్ద టాపాసు

వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్లతో రచ్చ క్రియేట్ చేసిన వర్మ, ఇప్పుడు దీపావళి పండగ పూట ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.ఈ సినిమాతో మరోసారి ఆంధ్ర రాజకీయాలపై తనదైన మార్కు వదలాలని వర్మ చూస్తున్నాడు.

 Rgv Kamma Rajyam Lo Kadapa Reddlu Movie Trailer Released-TeluguStop.com

ఇక కమ్మరాజ్యంలో కడప రెడ్లు చిత్ర ట్రైలర్‌లో ఏపీ రాష్ర ఎన్నికల తర్వాత అక్కడ జరిగిన మార్పులను తనదైన రీతిలో చూపించేందుకు వర్మ ప్రయత్నిస్తున్నాడు.ఈ ట్రైలర్‌లో ఏ ఒక్క రాజకీయ నాయకుడిని కూడా వర్మ వదిలినట్లు లేడు.

చంద్రబాబు, జగన్, పవన్, లోకేష్ మొదలుకొని ప్రధాని మోదీ, అమిత్ షాలను కూడా ఈ సినిమాలో చూపించాడు వర్మ.

గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంతో ఏపీ రాజకీయాల్లో తనదైన రీతిలో మార్పు సృష్టించాడు వర్మ.

ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి సెన్సేషన్‌కు తెరలేపేందుకు వర్మ రెడీ అయ్యాడని సినీ విశ్లేషకులు అంటోన్నారు.ఇక ఈ సినిమాలో జగన్ పాత్రలో అజ్మల్ అమీర్ నటిస్తున్నాడు.

ఈ సినిమాను వర్మ శిష్యుడు సిద్ధార్ధ తాతోలు డైరెక్ట్ చేస్తున్నాడు.మరి ఈ సినిమా రిలీజైన తరువాత ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి అంటున్నాయి సినీ వర్గాలు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube