టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఎవరి మీద ఎందుకు సెటైర్స్ వేస్తాడో ఎవరు ఊహించలేరు.అయితే అతను వేసిన సెటైర్స్ అన్ని సినిమాల రూపంలో ప్రేక్షకుల ముందుకి వస్తాయి.
కేవలం పబ్లిసిటీ కోసం సినిమాలు తీసే అతి కొద్ది మంది దర్శకుల జాబితాలో ఆర్జీవి కూడా ఉంటాడని చెప్పొచ్చు.అలాగే పనికిమాలిన సినిమాకి కూడా కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చుకోవడంలో ఆర్జీవి తనదైన శైలిలో వెళ్తూ ఉంటాడు.
సంచలనాలు కోసం, ఒక వర్గాన్ని టార్గెట్ చేయడం కోసం సినిమాలు తీసే తెలివైన దర్శకుడు వర్మ గతంలో రక్తచరిత్ర తో పరిటాల రవి హత్యని తెరపై చూపించాడు.అలాగే వంగవీటి సినిమాతో విజయవాడ రౌడీయిజంని తెరపై ఆవిష్కరించాడు.
ఇదిలా ఉంటే బాలకృష్ణతో ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకెక్కించే అవకాశం ముందుగా ఆర్జీవికి వచ్చిందని అని టాలీవుడ్ లో టాక్ ఉంది.అయితే మధ్యలో ఇద్దరి మధ్య ఏమైందో తెలియదు కాని, బాలకృష్ణ ఎన్టీఆర్ కి పోటీగా ఆర్జీవి లక్ష్మీస్ ఎన్టీఆర్ ని తెరపైకి తీసుకొచ్చాడు.ఇందులో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులని టార్గెట్ గా చేసుకొని వారిని విలన్స్ గా చిత్రీకరించే ప్రయత్నం చేసాడు.పూర్తిగా లక్ష్మి పార్వతి దృక్కోణంలో కథని నడిపించి ఎన్టీఆర్ వారసులు అందరూ చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలు అనే విధంగా చూపించాడు.
ఇదిలా ఉంటే ఎన్నికల ముందు చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ ని లక్ష్మీస్ ఎన్టీఆర్ దెబ్బ తీసే విధంగా ఉందని ఆ పార్టీ నేతలు హైకోర్ట్ ని ఆశ్రయించారు.ఈ నేపధ్యంలో ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఅర్ రిలీజ్ ని నిలిపేసిన మిగిలిన చోట సినిమా రిలీజ్ అయ్యింది.ఇక సినిమా రిలీజ్ తర్వాత పోజిటివ్ ఎవరేజ్ టాక్ తెచ్చుకున్న టీడీపీ వ్యతిరేకులకి, అలాగే వైసీపీ అభిమానులకి ఈ సినిమా భాగా నచ్చేసింది.లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో చంద్రబాబు ఇమేజ్ ని దెబ్బ కొట్టాలనే ఆర్జీవి ప్రయత్నం మొత్తానికి కొంత వరకు సక్సెస్ అయ్యింది అని చెప్పాలి.
బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ కంటే మొదటి రోజు ఎక్కువ కలెక్షన్ ఈ సినిమా సొంతం చేసుకోవడం విశేషం.