తెలంగాణలో దిశ అనే అమ్మాయి పై జరిగిన దారుణ సంఘటన అందరికీ తెలిసిందే.అతి కిరాతకంగా ఆమెపై కొందరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడి ఆపై శరీరం పై పెట్రోల్ పోసి బూడిద చేసిన సంగతి అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే.
అయితే ఆ తర్వాత నిందితులను ఈ సంఘటన నేపథ్యంలో పోలీసులు ఎన్ కౌంటర్ చేసారు.ఇక అసలు విషయంలోకి వెళితే….
తన స్టైలే వేరు అంటూ సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మ తాజాగా వరుస సినిమాలతో బిజీ బిజీగా జీవితాన్ని గడిపేస్తున్నారు.ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద చిత్రాలను చిత్రీకరిస్తూ ఎప్పటికప్పుడు తరచూ వార్తల్లో ఆయన నిలుస్తున్నారు.
ఇదివరకే తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు ఆధారంగా ‘ మర్డర్ ‘ అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఆయన ఇదివరకే ప్రకటించారు.ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను కూడా విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
అదేవిధంగా తన జీవిత కథలతో ‘రాము’ అనే సినిమాని కూడా తెరకెక్కిస్తున్నట్లు ఆయన ప్రకటించాడు.అయితే ఇది వరకే దిశ అత్యాచార ఘటన సారాంశంగా తీసుకుని ఓ సినిమా తీస్తానని చెప్పిన రాంగోపాల్ వర్మ ఎట్టకేలకు ఆ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశాడు.
గత సంవత్సరం నవంబర్ 24న హైదరాబాద్ కు చెందిన దిశ అనే యువతిపై జరిగిన దారుణానికి ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు రామ్ గోపాల్ వర్మ.అయితే ఈ సినిమాకు సంబంధించి ‘ దిశ – ఎన్ కౌంటర్ ‘ అనే సినిమా తీస్తున్నట్లు… ఇందుకు సంబంధించి సెప్టెంబర్ 26న సినిమా టీజర్ ను విడుదల చేస్తున్నట్లు ట్విట్టర్ పూర్వకంగా రాంగోపాల్ వర్మ తెలియజేశారు.
ఇక ఈ సినిమాను దిశ హత్య జరిగిన రోజున అంటే నవంబర్ 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ఆయన తెలిపారు.అంతేకాదు ఆ సంఘటన జరిగిన తరువాత కొన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ చట్టాన్ని మార్చడమే కాకుండా, బాధితురాలు పేరుతో పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పడడం చాలా గొప్ప విషయం అని రాంగోపాల్ వర్మ వరుస ట్వీట్లు సంధించాడు.
వీటితో పాటు సినిమాకు సంబంధించి కొన్ని వర్కింగ్ స్టిల్స్ కూడా షేర్ చేశాడు.