వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటి వరకు పదుల సంఖ్యలో సినిమాలు ప్రకటించి చేయకుండా వదిలేశాడు.కాని ఈసారి మాత్రం వర్మ అన్నట్లుగానే సినిమాను తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.
రామ్ గోపాల్ వర్మ ఇటీవల కరోనా వైరస్ పై సినిమాను తీసినట్లుగా ప్రకటించాడు.లాక్ డౌన్లోనే తాను షూటింగ్ చేసినట్లుగా చెప్పి అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఇప్పుడు ఆ సినిమా ట్రైలర్ను విడుదల చేయడం జరిగింది.
వర్మ ఈ సినిమాను తెలుగులో తెరకెక్కించాడు.విభిన్నమైన కథాంశంతో సినిమాలు తీయడం ఎప్పుడో మానేసిన వర్మ ప్రస్తుతం సమాజంలో కరోనా వైరస్ గురించి ఉన్న ఆందోళనల గురించి కళ్లకు కట్టినట్లుగా చూపించే ప్రయత్నం చేశాడు.ఒక ఇంట్లో కుటుంబ సభ్యుల మద్య కరోనా సృష్టించిన కల్లోలంను వర్మ చూపించాడు.
సినిమాను ఒక హర్రర్ సినిమా రేంజ్లో వర్మ చూపించే ప్రయత్నం చేశాడు.కుటుంబంలో ఒక అమ్మాయి పదే పదే దగ్గుతూ ఉంటే ఆమెకు కరోనా అని అంతా భయపడుతూ ఉంటారు.
ఇంతకు ఆ అమ్మాయికి కరోనా ఉందా లేదా అనేది మాత్రం ట్రైలర్లో చూపించలేదు.పూర్తి సినిమా విడుదల అయ్యేది ఎప్పుడు అనేది వర్మ క్లారిటీ ఇవ్వలేదు.థియేటర్లలో రాబోతుందా లేదంటే ఓటీటీలో విడుదల చేస్తారా అనే విషయంలో కూడా స్పష్టత ఇవ్వలేదు.కరోనా వైరస్ మూవీని ఏదో సాదా సీదాగా వెబ్ సిరీస్ మాదిరిగా లేదంటే సీరియల్ మాదిరిగా వర్మ చిత్రీకరించలేదు.
ఫీచర్డ్ ఫిల్మ్ మాదిరిగానే అన్ని హంగులతో రూపొందించాడు. థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు వెంటనే సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.