వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా, వివాదాస్పద ట్వీట్ల ద్వారా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వార్తల్లో ఎక్కువగా నిలుస్తూ ఉంటారు.తాజాగా ఎన్టీఆర్, అఖిల్ గురించి వివాదాస్పద ట్వీట్ చేసి ఆర్జీవి వార్తల్లో నిలిచారు.
ఈ మధ్య కాలంలో వివాదాలకు దూరంగా ఉంటున్న వర్మ ఎన్టీఆర్, అఖిల్ కు సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఆ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్, అఖిల్ పక్కపక్కనే కూర్చుని ఉన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ సరదాగా అఖిల్ తొడను గిల్లగా ఎన్టీఆర్ అలా చేయడంతో అఖిల్ సిగ్గు పడతాడు.ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసిన వర్మ ” ఇక హీరోయిన్ల ఫ్యూచర్ ఏంటి.? నేను హీరోయిన్ల విషయంలో చాలా బాధ పడుతున్నాను” అని పేర్కొన్నారు.ఆర్జీవీ షేర్ చేసిన వీడియోకు కొంతమంది నెటిజన్లు రివర్స్ లో కౌంటర్లు ఇస్తున్నారు.
ఎన్టీఆర్, అఖిల్ ఫ్యాన్స్ కు కోపం వచ్చే విధంగా ఆర్జీవీ వ్యవహరించడం గమనార్హం.
కొంతమంది నెటిజన్లు ఎన్టీఆర్, అఖిల్ సరదాగా ఉండటాన్ని తప్పుడు ఉద్దేశంతో చూడటం సరికాదని కామెంట్ చేశారు.మరి కొందరు నెటిజన్లు వర్మ మందు తాగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని కామెంట్లు చేస్తున్నారు.ఇంకొందరు నెటిజన్లు ఆర్జీవీ మందు తాగి సోషల్ మీడియాలో వెర్రి వేషాలు వేస్తున్నాడని అభిప్రాయపడుతున్నారు.
వర్మపై నందమూరి, అక్కినేని ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు.
అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకుని వర్మ వివాదాలను సృష్టించుకుంటున్నారని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రామ్ గోపాల్ వర్మ వెర్రివేషాలు తగ్గించుకోవాలంటూ కొందరు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సూచిస్తున్నారు.మరోవైపు ఆర్జీవీ గోవాకు పరిమితమై తెలుగు సినిమాలతో పాటు హిందీ సినిమాలను ఎక్కువగా తెరకెక్కిస్తున్నారు.
ఆర్జీవీ తెరకెక్కిస్తున్న సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవడం గమనార్హం.