వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ఏపీలో రాజకీయాలని లక్ష్యంగా చేసుకొని కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా తీయాడు.ఈ సినిమాకి కావాల్సినంత ఫ్రీ పబ్లిసిటీ చేసుకొని సెన్సార్ కూడా పూర్తి కాకుండానే రిలీజ్ కి డేట్ కూడా ప్రకటించేసాడు.
ఇక కావాలని కొందరిని కించపరిచే విధంగా ఈ సినిమా తెరకెక్కించడంతో కొంత మంది హై కోర్టుకి వెళ్ళడం, హై కోర్టు సెన్సార్ కి క్లాస్ పీకడం జరిగింది.ఇదే టైంలో సెన్సార్ వారిని కూడా వర్మ కెలికాడు.
సెన్సార్ అనేది అవుట్ డేట్ కాన్సెప్ట్ అని వ్యాఖ్యలు చేసాడు.దీంతో ఆ వ్యాఖ్యలని మనసులో ఉంచుకున్నారో, సినిమా చూసి షాక్ తిన్నారో కాని కమ్మ రాజ్యం సినిమాకి సర్టిఫికేట్ ఇవ్వలేం అని తేల్చి చెప్పేశారు.
ఇప్పుడు ఈ వివాదం నడుస్తున్న కూడా వర్మ ఎందుకనో ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నాడు.
ఇదిలా ఉంటే వర్మ కంపెనీ నుంచి తన శిష్యుడు అగస్త్య మంజు దర్శకత్వంలో టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై బ్యూటిఫుల్ అనే సినిమా తెరకెక్కుతుంది.
నైనా గంగూలీ హీరోయిన్ గా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.ఎలాంటి కట్స్ లేకుండా నేరుగా ఎ సర్టిఫికెట్ ఇచ్చారు.
ఈ విషయాన్ని చిత్రబృందం తెలియజేస్తూ త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని పేర్కొంది.లవ్ స్టొరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా వర్మ స్టైల్ లోనే బోల్డ్ గా ఉంది.
అయిన కూడా సెన్సార్ ఎలాంటి అభ్యంతరాలు పెట్టకుండా సినిమాకి సర్టిఫికేట్ ఇచ్చింది.దీంతో ఆర్జీవి శిష్యుడుకి పర్మిషన్ ఇచ్చిన సెన్సార్ అతనిని మాత్రం ఇబ్బంది పెడుతుంది అనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తుంది.