తమిళనాడు ఎన్నికల వేళ శశికళ బయోపిక్ ని తెరపైకి తెచ్చిన ఆర్జీవీ

టాలీవుడ్ లో వివాదాస్పద దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి రామ్ గోపాల్ వర్మ.ఈ మధ్య కాలంలో అతను చేసే సినిమాలు అన్ని కూడా వివాదాస్పద అంశాల చుట్టూ తిప్పుతూ కేవలం పబ్లిసిటీ స్టంట్ గానే ఉంటున్నాయి తప్ప ఒక్కదానిలో కూడా విషయం ఉండటం లేదు.

 Rgv Announces Sasikala Biopic, Kollywood, Tollywood, Jayalalitha, Tamil Politics-TeluguStop.com

అయితే ఆర్జీవీ అనే బ్రాండ్ ఇమేజ్ వలన అతను ఎలాంటి చెత్త సినిమాలు చేస్తున్న ఒక వర్గం ప్రేక్షకులు చూస్తూ ఉంటారు.ప్రస్తుతం మర్డర్ అని ప్రణయ్, అమృత కథలని తెరపై ఆవిష్కరించాడు.

అలాగే దిశ ఎన్ కౌంటర్ టైటిల్ తో ఒక సినిమాని తీస్తున్నాడు.ఈ రెండు కథలు నిజ జీవిత అంశాలని స్పూర్తిగా తీసుకొని చేసినవే.

అలాగే ఆర్జీవీ చాలా వివాదాస్పద వ్యక్తుల బయోపిక్ లని కూడా తీశారు.ఈ నేపధ్యంలో మూడేళ్ళ క్రితం శశికళ బయోపిక్ ని ఎనౌన్స్ చేశాడు.

తరువాత దీని గురించి ఊసే లేదు.

అయితే మరల ఇప్పుడు ఆర్జీవీ శశికళ బయోపిక్ ని తెరపైకి తీసుకొచ్చాడు.

తమిళనాడు ఎన్నికల నేపధ్యంలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తే కావాల్సినంత ప్రచారం లభించడంతో సినిమాకి పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందని ఆర్జీవీ ప్లాన్ చేస్తున్నాడు.ఈ జనవరిలోనే జైలు నుంచి శశికళ విడుదల కాబోతుంది.

తరువాత ఆమె తమిళనాడు రాజకీయాలని శాసించే అవకాశం ఉంది.ఈ క్రమంలోనే ఈ వివాదాస్పద సబ్జెక్ట్ ను వర్మ టేకప్ చేయడం విశేషం.

జయలలిత ప్రియసఖిగా తమిళ రాజకీయాలలో పాపులర్ అయిన శశికళ బయోపిక్ ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉంది.తమిళనాడు నేతల మధ్య ఉన్న బంధాన్ని వారి రాజకీయ తెరంగేట్రాన్ని చూపించబోతున్నా.

తమిళనాడు ఎన్నికల కన్నా ముందు జయలలిత బయోపిక్ రిలీజ్ అయ్యే రోజునే దీన్ని కూడా విడుదల చేస్తాం అని ఓ ఫొటోను రాంగోపాల్ వర్మ విడుదల చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube