కొత్త డేట్‌ ఇచ్చిన వర్మ... ఆ డేట్‌లో కూడా ఖచ్చితంగా రాదు

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ రూపొందించిన అత్యంత వివాదాస్పద చిత్రం ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంను ఈనెల 22న విడుదల చేయాలని భావించారు.

 Rgv Announces New Date For Lakshmis Ntr-TeluguStop.com

అయితే ఎన్నికల ముందు ఈ సినిమా విడుదల చేస్తే చంద్రబాబు నాయుడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలుగు దేశం పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు.అందుకే ఈసీకి మరియు సెన్సార్‌ బోర్డుకు వర్మ సినిమా ఆపేయాలంటూ విడుదల అడ్డుకోవాలంటూ టీడీపీ నాయకులను కోరిన విషయం తెల్సిందే.

ఈసీ ఈ సినిమాను అడ్డుకునేందుకు నో చెప్పింది.అయితే సెన్సార్‌ బోర్డు మాత్రం ఈ చిత్రం విడుదలకు మోకాలు అడ్డింది.ఎన్నికల సమయంలో ఇలాంటి రాజకీయ సినిమాలు విడుదల సబబు కాదని, ఈ సినిమాకు ఇప్పుడు సెన్సార్‌ ఇవ్వలేమని, మీరు ఎన్నికల తర్వాత విడుదల చేసుకోవాల్సిందిగా సెన్సార్‌ బోర్డు వారు చిత్ర యూనిట్‌ సభ్యులకు తెలియజేయడం జరిగింది.దాంతో వర్మ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.

తాను ముందు నుండి అనుకుంటున్నట్లుగా ఈనెల 22న కాకుండా 29వ తారీకున ఈ చిత్రంను విడుదల చేస్తానంటూ ప్రకటించాడు.

అప్పటి వరకు కోర్టుకు వెళ్లి లేదంటే కేంద్ర ఎన్నికల సంఘం వరకు కూడా వెళ్లి తన సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ తెస్తాను.29వ తారీకున సినిమాను విడుదల చేస్తానంటూ వర్మ ప్రకటించాడు.అయితే వర్మ కొత్తగా ప్రకటించిన 29వ తారీకున కూడా సినిమా విడుదల అనుమానమే అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.

ఎందుకంటే ఎన్నికలు పూర్తి అయితే తప్ప ఈ సినిమాకు సెన్సార్‌ క్లియరెన్స్‌ రాదు అని, వర్మ ఎన్ని ప్రయత్నాలు చేసినా అది సాధ్యం అయ్యే విషయం కాదని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube