రామ్ గోపాల్ వర్మ నిన్న విడుదల చేసిన ‘మర్డర్’ సినిమా ఫస్ట్లుక్ చర్చనీయాంశం అయిన విషయం తెల్సిందే.నల్లగొండ జిల్లా మిర్యాలగూడెంలో జరిగిన పరువు హత్య ఆ తర్వాత జరిగిన సంఘటనల ఆధారంగా వర్మ ఆసినిమాను తీస్తున్నాడు అనే విషయం అందరికి తెల్సిందే.
ఒక తండ్రి తన కూతురు కోసం చేసిన సాహసం గొప్పది అంటూ చెప్పే ఉద్దేశ్యంతో వర్మ ఫాదర్స్ డే సందర్బంగా ఈ సినిమా ఫస్ట్లుక్ను విడుదల చేయడం జరిగింది.వర్మ ఫస్ట్లుక్పై అమృత తీవ్రంగా స్పందించిందని, ఆ పోస్టర్ చూసిన వెంటనే చనిపోవాలనిపించింది అంటూ వ్యాఖ్యలు చేసింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే నా జీవితం తలకిందులు అయ్యింది.కొడుకుతో కొంత అయినా ప్రశాంతంగా గడుపుతున్నాను.
ఇలాంటి సమయంలో నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడతారు అంటూ అమృత ఎమోషనల్ అయ్యింది అంటూ పెద్ద ఎత్తున ఒక కథనం వైరల్ అయ్యింది.దానికి వర్మ కూడా స్పందించాడు.
తాను ఎవరిని బాధ పెట్టాలని కాదు.సంఘటనల ఆధారంగా సినిమా తీస్తున్నాను తప్ప ఎవరిది తప్పు అనే విషయాన్ని మాత్రం నేను చెప్పదల్చుకోలేదు అంటూ వివరణ ఇచ్చాడు.
ఇంతా చూస్తే అసు అమృత ఇప్పటి వరకు మర్డర్ చిత్రంపై కనీసం స్పందించలేదు.అసు వర్మ మర్డర్ సినిమా గురించి అమృత ఇప్పటి వరకు సోషల్ మీడియాలో కాని టీవీల్లో కాని స్పందించలేదట.ఈ విషయాన్ని అమృత మామ అయిన బాలస్వామి పేర్కొన్నారు.ఈ విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్నది అంతా ప్రచారం మాత్రమే అన్నాడు.ఇదంతా చూస్తుంటే వర్మనే ఈ ప్రచారం అమృత పేరుతో చేసి ఉంటాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.వర్మ పబ్లిసిటీ కోసం ఏం చేసేందుకు అయినా సిద్దపడతాడనే విషయం తెల్సిందే.అందుకే వర్మను అనుమానించాల్సి వస్తుంది.
—