తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త అధ్యాయం వచ్చి పడింది.అదే టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం.
ఇక ఇలా ప్రెసిడెంట్ అయ్యాడో లేదో తన టార్గెట్ సీఎం కేసీఆరే అని తేల్చి చెప్పాడు.టీఆర్ ఎస్ అంటేనే ఒంటి కాలిపై లేచే రేవంత్రెడ్డి.
ఇప్పడు కాంగ్రెస్ను నడిపించే బాధ్యత తీసుకున్నాడు.దీంతో ఆయనకు ఇంపార్టెన్స్ అనూహ్యంగా పెరిగిందనే చెప్పాలి.
మొదటి నుంచి ప్రభత్వంపై విరుచుకుపడుతున్న రేవంత్ ఇక ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పడం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది.అనుకున్న ది సాధించే వరకు నిద్రపోని వ్యక్తిగా పేరున్న రేవంత్కు ఇప్పుడు టీఆర్ ఎస్కు చెక్ పెట్టేందుకు గట్టి పట్టు దొరికింది.
అయితే ఇదే సమయంలో టీఆర్ ఎస్ను గద్దె దించడం అంత ఈజీ కాదన్న విషయం కూడా రేవంత్కు బాగా తెలుసు.కానీ గట్టిగా ప్రయత్నిస్తే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదన్న నమ్మకంతోనే రేవంత్ రెడ్డి ముందుకెళుతున్నాడు.
ఇందుకోసం ప్రధానంగా రెండు విషయాలను ప్రకటించాడు.మొదటిది నిరుద్యోగ అస్త్రాన్ని కేసీఆర్ మీద ప్రయోగించబోతున్నట్టు తెలుస్తోంది.
ఈ ఆయుధంతోనే రేవంత్ సర్కార్ పై యుద్ధానికి రెడీ అవుతున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
దీంతో పాటే కాంగ్రెస్కు కలిసి వచ్చిన పాదయాత్రను త్వరలోనే స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది.ఇప్పటి దాకా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి నారా చంద్రబాబుతో పాటే వైఎస్ జగన్ దాకా అందరూ పాదయాత్రల ద్వారానే అధికారంలోకి వచ్చారు.ఇక దాన్నే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వర్కౌట్ చేయబోతున్నారు.
ఇప్పటికే రైతు భరోసా యాత్ర చేసిన రేవంత్.త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక రెడ్డిలతో పాటు బీసీలను కూడా తన వైపుకు తిప్పుకునేందుకు రేవంత్ పక్కా ప్లాన్ ప్రకారం ముందుకెళుతున్నాడన సమాచారం.