తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నిన్న కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీతో భేటీ అయిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా రాహుల్ గాంధీని ప్రతి మూడు నెలలకోసారి తెలంగాణలో పర్యటించాలని రేవంత్ రెడ్డి తో పాటు మరి కొంత మంది టీ కాంగ్రెస్ నేతలు కోరడం జరిగింది.
ఈ రోజు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ డైరెక్టర్ తో భేటీ అవడానికి రేవంత్ రెడ్డి రెడీ అయ్యారు.ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో డ్రగ్స్ వ్యవహారం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
డ్రగ్స్ వ్యవహారంతో పాటు మనీ లాండరింగ్ ఆరోపణలు కూడా వస్తూ ఉండటంతో ఈడి కూడా రంగంలోకి దిగి విచారణ చేస్తూ ఉంది.
ఇటువంటి తరుణంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పై అనేకమైన ఆరోపణలు చేస్తూ టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి.సిబిఐ డైరెక్టర్ నీ కలవడానికి రెడీ అయ్యారు.డ్రగ్స్ వ్యవహారంతో పాటు పలు అంశాలపై విచారణ క్షుణ్ణంగా సిబిఐ చేత చేయించాలని రేవంత్ రెడ్డి కోరనున్నట్లు సమాచారం.
మొదటినుండి డ్రగ్స్ విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు సమగ్రంగా విచారణ చేపట్టడం లేదని.రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.దీంతో ఈ విషయంలో ప్రభుత్వ పెద్దల హస్తం కూడా ఉంది అన్న తరహాలో ఆరోపణలు చేస్తూ కేసులో వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని సిబిఐ డైరెక్టర్ ని రేవంత్ రెడ్డి కోరనున్నట్లు సమాచారం.