టీ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వైసీపీ మంత్రి పేర్ని నాని కి వార్నింగ్ ఇచ్చారు.విషయంలోకి వెళితే ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్.
.ఏపీలో కూడా టిఆర్ఎస్ పార్టీ పెట్టాలని అనేక ప్రతిపాదనలు వస్తున్నాయని, చాలామంది ఫోన్లు చేస్తున్నారని భారీ బహిరంగ సభలో కామెంట్లు చేయడం జరిగింది.
ఈ ఖమ్మంలో వైసీపీ మంత్రి పేర్ని నాని ఏపీలో కెసిఆర్ టిఆర్ఎస్ పార్టీ పెడితే కచ్చితంగా స్వాగతిస్తామని… ఇక అదే తరుణంలో ప్రత్యేకంగా పార్టీ పెట్టడం ఎందుకు రెండు రాష్ట్రాలను కలిపేయొచ్చు కదా అంటూ కౌంటర్లు వేశారు.
దీంతో రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో పేర్నినాని చేసిన కామెంట్ లకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.ఎంతోమంది బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.తెలంగాణ జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదు అంటూ సోషల్ మీడియాలో వార్నింగ్ ఇచ్చే రీతిలో కామెంట్లు పెట్టారు.
కేసీఆర్ రాజ్య విస్తరణ కాంక్షకు తెలంగాణను బలిచ్చే కుట్ర జరుగుతోందని రేవంత్ ఆరోపించారు.టీఆర్ఎస్ ప్లీనరీలో తెలుగుతల్లి ప్రత్యక్షం కావడం, మంత్రి పేర్ని నాని సమైక్య రాష్ట్ర ప్రతిపాదన తీసుకురావడం కేసీఆర్, జగన్ ల ఉమ్మడి కుట్ర.
కొన్ని వందలాది మంది ప్రాణత్యాగాలు బలిదానాలు చేస్తే తెలంగాణ ఏర్పడింది అటువంటి రాష్ట్రం జోలికి వస్తే కబడ్ధార్ అంటూ.రేవంత్ రెడ్డి హెచ్చరించారు.