దివంగత వైయస్ జయంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో వివిధ పార్టీల రాజకీయ నాయకులు వైఎస్ కి నివాళులు అర్పిస్తున్నారు.ఇప్పటికే ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ షర్మిల కుటుంబ సభ్యులతో అదే రీతిలో తెలంగాణలో పార్టీ నాయకులతో అభిమానులతో కలిసి ఉదయం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగింది.
ఇక సాయంత్రం ఏపీ సీఎం వైఎస్ జగన్ వైఎస్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.ఇదిలా ఉంటే తెలంగాణ పిసిసి చీఫ్ అధ్యక్షుడిగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి తాజాగా పంజాగుట్టలో వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులు అర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, పొన్నాల లక్ష్మయ్య తదితర కాంగ్రెస్ నేతలు పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా వైఎస్ఆర్ మహనీయుడు అంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొనియాడారు.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం నెలకొన్న సమస్యలపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గతంలో కూర్చుని మాట్లాడుకున్నట్లు ఇప్పుడు కూడా ఇబ్బందులు సమస్యల విషయంలో కూర్చొని మాట్లాడుకోవాలని రెచ్చగొట్టే తరహాలో వ్యవహరించ కూడదని కాంగ్రెస్ నాయకులు సంచలన వ్యాఖ్యలు చేశారు.