కాంగ్రెస్ లో ఇప్పుడు చర్చ అంతా రేవంత్ రెడ్డి పైనే జరుగుతున్నది.కాంగ్రెస్ అంటేనే గ్రూపులు, గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు.
అయితే ఇప్పటిక వరకు నియమించబడిన పీసీసీ అధ్యక్షులు కూడా గ్రూపు రాజకీయాల వల్ల అంతగా సక్సెస్ కాలేక పోయారు.కాని రేవంత్ ఈ విషయంలో చాలా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
అయితే ఇప్పుడు అందరి వాడు అనిపించుకునేలా కాంగ్రెస్ సీనియర్ నేతలు అందరితోనూ సంప్రదింపులు జరుపుతూ, స్వయంగా వారిళ్లకే వెళ్లి కలుస్తున్న పరిస్థితి ఉంది.అయితే ఇటు వంటివి కాంగ్రెస్ లో చాలా అరుదుగా చూస్తూ ఉంటాం.
అయితే రేవంత్ రెడ్డి వేస్తున్న ఈ అడుగులు చాలా వ్యూహాత్మకంగా వేస్తున్నట్లు కనిపిస్తోంది.అయితే కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న గ్రూపు రాజకీయాలు అనే పేరును పోగొట్టాలన్నదే రేవంత్ మొదటి వ్యూహంలా కనిపిస్తోంది.
రేవంత్ వ్యూహాలు కలిసొస్తే కాంగ్రెస్ కు మహర్దశ మొదలైనట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మరి రేవంత్ వెంట కలిసి వస్తారో లేదో చూడాల్సి ఉంది.ఒకవేళ అందరూ పార్టీ అభివృద్ధికి పూనుకుంటే కాంగ్రెస్ ను ఆపడం ఎవరి తరమూ కాదు.అంతేకాక ప్రజల్లో పెద్ద ఎత్తున ఆదరణ కలుగుతుంది.అంతేకాక కాంగ్రెస్ కార్యకర్తలలో నూతనోత్సాహం వస్తుంది.ఇది ఒక శుభ పరిణామంగా మనం చెప్పుకోవచ్చు.