ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో కొత్త అధ్యాయం మొదలైంది.ఇప్పటికే రేవంత్కు ప్రెసిడెంట్ ఇచ్చేయడంతో కొందరు విమర్శిస్తున్నారు.
మరి కొందరేమో సపోర్టుగా నిలుస్తున్నారు.అయితే అందర్నీ కలుపుకుపోవాలని రేవంత్ ఎంత ట్రై చేస్తున్నా సొంత పార్టీ నేతలు మాత్రం ఆయనకు కలిసి రావట్లేదు.
ఇక ఇదే అదునుగా అధికార పార్టీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారని, రేవంత్ అసలు టీడీపీ నేత అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఇదే విషయంలో కాంగ్రెస్ నేత మల్లు రవి గట్టి కౌంటర్ వేశారు.టీఆర్ఎస్ నేతలకు దిమ్మ తిరిగే సెటైర్ వేసి వారిని డిఫెన్స్ లో పడిపోయేలా చేశాడు రవి.
టీఆర్ ఎస్ నేతలందరూ రేవంత్పై పదే పదే టీడీపీ నేత అంటూ విమర్శలు చేయడంతో పాటు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా ఇలాగే కామెంట్లు చేస్తూ విమర్శిస్తున్నారు.అయితే దీనికి మల్లు రవి కౌంటర్ విసురుతూ సీఎం కేసీఆర్ కూడా మొదట్లో చంద్రబాబు నడిపిన టీడీపీ పార్టీ నుంచి వచ్చి టీఆర్ఎస్ కు అధ్యక్షుడుగా నియమితులయ్యారని గుర్తు చేస్తూ స్ట్రాంగ్ కౌంటర్ విసిరారు.
అంతే కాదు రేవంత్ను విమర్శిస్తున్న ఎమ్మెల్యే జీవన్రెడ్డి కూడా టీడీపీ నుంచే వచ్చాడని ఎద్దేవా చేశారు.
ఇక కేసుల విషయంలో కూడా మల్లు రవి మరో అస్త్రం సంధించాడు.రేవంత్ పై కేసులున్నాయని కౌంటర్లు వేస్తున్నారని ఆ విషయానికొస్తే కేసీఆర్ మీద కూడా సీబీఐ కేసులు ఉన్నాయని విమర్శించారు.వాటి నుంచి తప్పించుకోవడం కోసమే కేసీఆర్ కేంద్రంవద్ద లొంగిపోతున్నారని ఎద్దేవా చేశారు.
అయితే చాలామంది రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మారుతున్నా మల్లు రవి మాత్రం రేవంత్కు అండగా నిలవడం కలవర పెడుతోంది.ఇక రేవంత్ కు ఒక్కొక్కరుగా సపోర్టు ఇస్తూ రాజకీయంగా ఎదిగేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.
చూడాలి మరి రేవంత్కు ఎంత మంది సపోర్టుగా నిలుస్తారో.