ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది.కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇచ్చినా దానిని రాజకీయంగా మలుచుకోవడంలో కాంగ్రెస్ నేతలు విఫలమైన విషయం తెలిసిందే.
అయితే ఇప్పటి వరకు జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఉప ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి చతికిల పడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం రెండో స్థానంలో కూడా నిలవలేకపోయింది.అయితే త్వరలో తెలంగాణలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.
ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికలు ఒక ఎత్తు అయితే ఈ ఎన్నికలు ఒక ఎత్తు అని చెప్పవచ్చు.
ఎందుకంటే నాగార్జునసాగర్ అనేది కాంగ్రెస్ కు కంచుకోట.
ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఏడు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో 7 వేల ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయాడు.
అయితే ఓ సారి తృటిలో తప్పిన ఈ సారి మరల తన పట్టు నిలుపుకునేందుకు ఈ ఉప ఎన్నిక రూపంలో ఓ అవకాశం దొరికింది.అయితే ఇప్పటికే కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ కు పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
అయితే ఇక ఈ ప్రచారంలో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి జాయిన్ అవునున్నాడు.ఇక ప్రచారంలో రేవంత్ చేరికతో ఇక ప్రచారానికి మాస్ టచ్ రానున్నదని చెప్పవచ్చు.
ఇక ఇప్పటి నుండి టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలే అవకాశం ఉంది.మరి ఈ ఎన్నికలో నైనా కాంగ్రెస్ సత్తా చాటి తన పట్టునిలుపుకుంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.