ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.కాంగ్రెస్, బీజేపీ ఇప్పుడు టీఆర్ఎస్ కు ధీటుగా మారుతున్న పరిస్థితి ఉంది.
రేపు పీసీసీ అధ్యక్షునిగా రేపు ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.అయితే రేవంత్ ప్రమాణ స్వీకారం చేపట్టిన తరువాత రేవంత్ చేసే ప్రసంగంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.
అయితే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్బంగా రాష్ట్రం లోని పలు జిల్లాల నుండి కదిలి రానున్నారు.అంతేకాక ఇప్పటికే ఇంకా ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ పీసీసీ చీఫ్ లను కూడా రేవంత్ కలిసి ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని కోరిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ లను కలిసి అందరి సహకారాన్ని కోరడం జరిగింది.
అయితే సాధారణంగా రేవంత్ స్పీచ్ అనేది చాలా హోరాహోరీగా ఉంటుంది.
అయితే తీవ్ర ఉత్కంఠ నెలకొంది.కెసీఆర్ పై ఎటువంటి ఆరోపణలతో ముందుకెళ్తాడనేది చూడాల్సి ఉంది.
అయితే టీఆర్ఎస్ కు ఇప్పుడు కాంగ్రెస్ కూడా బలమైన ప్రతిపక్షంగా మారితే టీఆర్ఎస్ కొంత చిక్కులు తప్పేలా లేనట్లు తెలుస్తోంది.ఎందుకంటే ఇటు బీజేపీ పాదయాత్ర పేరుతో తెలంగాణలో పర్యటిస్తుండగా రేవంత్ రెడ్డి కూడా సరి కొత్త వ్యూహంతో ముందుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఏది ఏమైనా రేవంత్ ఎటువంటి వ్యాఖ్యలు చేస్తాడానే దానిపై ఉత్కంఠ నెలకొంది.