టీఆర్‌ఎస్‌ రెండు ముక్కలవ్వడం ఖాయం : రేవూరి

రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకోకుండా కాంట్రాక్టర్లకు రాష్ట్రంను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దోచి పెడుతున్నారంటూ బీజేపీ సీనియర్‌ నేత రేవూరి ప్రకాష్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.త్యాగాలు చేసి సంపాదించుకున్న తెలంగాణను కేసీఆర్‌ కుటుంబం దోచుకుంటుందని, ఆ కుటుంబం కోసమే తెలంగాణ తెచ్చుకున్నట్లుగా అయ్యిందని ఆయన ఆరోపించాడు.

 Revuri Prakash Reddy Comments On Kcr And Trs Party-TeluguStop.com

తెలంగాణ రాష్ట్రంను కేసీఆర్‌ కుటుంబ సభ్యులు తిరోగమనంలోకి నెడుతున్నారంటూ ఆయన విమర్శించాడు.మనవడితో భద్రాచలం రాముడికి తలంబ్రాలు మోయించిన ఘనత కేసీఆర్‌ది అంటూ రేవూరి ఎద్దేవ చేశాడు.

</br>

కేసీఆర్‌ చేస్తున్న రాచరిక పాలన ఆ పార్టీలోనే కొందరిని నచ్చడం లేదని, ఖచ్చితంగా త్వరలోనే టీఆర్‌ఎస్‌ పార్టీ రెండు ముక్కలవ్వడం ఖాయం అంటూ అభిప్రాయ పడ్డాడు.ఆ పార్టీకి చెందిన ఈటెల మరియు రసమయి బాలకృష్ణల వ్యాఖ్యలే ఆ పార్టీ రెండు ముక్కలు అవ్వనుందని సంకేతాలు ఇస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

రాష్ట్రంను అప్పుల ఊబిలో కేసీఆర్‌ కూర్చుతుంటే కాంగ్రెస్‌ పార్టీ నోరుమూసుకుని చోద్యం చూస్తుంది.ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న ఆ పార్టీ చేతకాక చేష్టలు ఉడిగి కేసీఆర్‌కు జై కొడుతున్నట్లుగా అనిపిస్తుందంటూ రేవూరి అన్నారు.

బీజేపీని రాష్ట్రంలో బలోపేతం చేయడంతో పాటు టీఆర్‌ఎస్‌ చేస్తున్న అవినీతి పాలన గురించి ప్రజలకు తెలియజేసేందుకు తమ కార్యకర్తలు పని చేస్తున్నారని ఆయన అన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube