రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకోకుండా కాంట్రాక్టర్లకు రాష్ట్రంను ముఖ్యమంత్రి కేసీఆర్ దోచి పెడుతున్నారంటూ బీజేపీ సీనియర్ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.త్యాగాలు చేసి సంపాదించుకున్న తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంటుందని, ఆ కుటుంబం కోసమే తెలంగాణ తెచ్చుకున్నట్లుగా అయ్యిందని ఆయన ఆరోపించాడు.
తెలంగాణ రాష్ట్రంను కేసీఆర్ కుటుంబ సభ్యులు తిరోగమనంలోకి నెడుతున్నారంటూ ఆయన విమర్శించాడు.మనవడితో భద్రాచలం రాముడికి తలంబ్రాలు మోయించిన ఘనత కేసీఆర్ది అంటూ రేవూరి ఎద్దేవ చేశాడు.
</br>
కేసీఆర్ చేస్తున్న రాచరిక పాలన ఆ పార్టీలోనే కొందరిని నచ్చడం లేదని, ఖచ్చితంగా త్వరలోనే టీఆర్ఎస్ పార్టీ రెండు ముక్కలవ్వడం ఖాయం అంటూ అభిప్రాయ పడ్డాడు.ఆ పార్టీకి చెందిన ఈటెల మరియు రసమయి బాలకృష్ణల వ్యాఖ్యలే ఆ పార్టీ రెండు ముక్కలు అవ్వనుందని సంకేతాలు ఇస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.
రాష్ట్రంను అప్పుల ఊబిలో కేసీఆర్ కూర్చుతుంటే కాంగ్రెస్ పార్టీ నోరుమూసుకుని చోద్యం చూస్తుంది.ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న ఆ పార్టీ చేతకాక చేష్టలు ఉడిగి కేసీఆర్కు జై కొడుతున్నట్లుగా అనిపిస్తుందంటూ రేవూరి అన్నారు.
బీజేపీని రాష్ట్రంలో బలోపేతం చేయడంతో పాటు టీఆర్ఎస్ చేస్తున్న అవినీతి పాలన గురించి ప్రజలకు తెలియజేసేందుకు తమ కార్యకర్తలు పని చేస్తున్నారని ఆయన అన్నాడు.